E-Paper
Advertisement

Chandrababu Naidu: జగన్ అహంకారంతో చరిత్రహీనుడిగా మిగిలారు: చంద్రబాబు

Chandrababu Naidu: జగన్ అహంకారంతో చరిత్రహీనుడిగా మిగిలారు: చంద్రబాబు
Advertisement

Chandrababu Naidu Speech In Pathapatnam Prajagalam Sabha: ఏపీ సీఎం జగన్ అహంకారంతో చరిత్రహీనుడిగా మిగిలారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పాతపట్నం ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మూడో సారి గెలిపించి పార్లమెంటు‌కి పంపించాలని అన్నారు.

ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. రాష్ట్రం గెలవాలనే మూడు పార్టీలు కలసి పోరాడుతున్నాయని పేర్కొన్నారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసమే కూటమిగా బరిలోకి దిగామని స్పష్టం చేశారు. జనసేనాని గురించి ప్రస్తావిస్తూ.. కేవలం సినిమాల్లోనే కాదు పవన్ కల్యాణ్ నిజజీవితంలో కూడా హీరోనేని తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా సేవ చేయడం కోసమని.. విధ్వంసం చేయడానికి కాదని అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని.. అహంకారంతో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని చంద్రబాబు మండిపడ్డారు.

Advertisement

సీఎం జగన్ అమరావతిని నాశనం చేశారని.. పోలవరాన్ని ముంచారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు. రైతుల పట్టాదారు పాసుపుస్తకాల మీద సీఎం జగన్ బొమ్మ ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. తాము అధికాంలోకి వచ్చాక రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తామని.. బీమా సదుపాయాన్ని అమలుచేస్తామన్నారు. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తామన్నారు.

Also Read: అన్ని వర్గాలకు అనుకూలంగా కూటమి మేనిఫెస్టో.. పేదలకు ఇళ్ల స్థలాలు: చంద్రబాబు!

Advertisement

దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లా కార్మికులు ఉంటారని వారి బాధలు పట్టించుకునే వారే లేరని చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారంలోకి రాగానే స్థానికంగానే వారికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×