E-Paper
Advertisement

Jagan more trouble: చంద్రబాబు సర్కార్ నిర్ణయం, చిక్కుల్లో జగన్, రేపోమాపో ఈడీ..

Jagan more trouble: చంద్రబాబు సర్కార్ నిర్ణయం, చిక్కుల్లో జగన్, రేపోమాపో ఈడీ..
Advertisement

Jagan more trouble: తెలుగు రాష్ట్రాలను లిక్కర్ స్కామ్‌లు కుదిపేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ బెయిల్ రాలేదు. తాజాగా ఏపీలో లిక్కర్ స్కామ్ బయటకువచ్చింది. మాజీ సీఎం జగన్‌తోపాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఈ ఉచ్చులో చిక్కుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయిని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులోకి ఈడీ దిగితే జగన్‌ పనైపోయినట్టేని అంటున్నారు.

వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీపై అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. మద్య విధానం వల్ల గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వానికి 18000 వేల కోట్ల మేరా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెల్లడించింది. రిటైల్ షాపుల ద్వారా 99 వేల 413 కోట్ల రూపాయలు వసూలు చేశారన్నది ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాదిలో మాత్రమే డిజిటల్ చెల్లింపులు చేశారని తేల్చిం ది. మొత్తం చెల్లింపుల్లో ఇది 0.66 శాతం మాత్రమే.

Advertisement

ఈ వ్యవహారంలో ఎంతమేరా అవినీతి జరిగిందనేది తెలియాలంటే లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయా లు వెలుగులోకి వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. వీటిపై ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. అసలే చంద్రబాబునాయుడు సపోర్టుతో కేంద్రప్రభుత్వం నడుస్తోంది. ఈ సమయంలో ఏపీ లిక్కర్ కేసు ఈడీకి అప్పగిస్తే మాజీ సీఎం జగన్‌కు మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చని అంటున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటిని ఫ్యాన్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమన్న వాదనలూ లేకపోలేదు.

గత ప్రభుత్వ లోపాలు ముందుగానే పసిగట్టిన మాజీ సీఎం జగన్ పథకం ప్రకారమే చంద్రబాబు సర్కార్‌పై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారని అంటున్నారు. రేపటి రోజున సీఐడీ నేతలను అదుపులోకి తీసుకున్నా రెడ్‌బుక్ వల్లే తమను ఇబ్బంది పెడుతున్నారని పైకి చెప్పడానికి వైసీపీకి ఇదొక పాయింట్‌గా చెబుతున్నా రు.

Advertisement

ALSO READ: ‘రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా..?’

ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. ఆఫీసు నుంచి పత్రాలు చోరీ చేశారన్న కారణంతో ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. ఈ విచారణలో కీలక సమాచారం సీఐడీకి లభించిందని, దాని ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్టేట్‌మెట్ ఇచ్చారన్నది రాజకీయ నిఫుణులు మాట. లిక్కర్ కేసు విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×