E-Paper
Advertisement

A.P. door to door ration: జగన్ రేషన్..బాబు పరేషాన్

A.P. door to door ration: జగన్ రేషన్..బాబు పరేషాన్
Advertisement

Chandrababu government take decision to ban door to door ration: వైఎస్ జగన్ పాలనలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ పథకం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అప్పట్లో రేషన్ డీలర్లు, పబ్లిక్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ పథకం కోసం జగన్ ఏకంగా తొమ్మిది వేలకు పైగా వాహనాలు కొనుగోలు చేశారు. వీటిల్లో వార్డులకు సంబంధించిన రేషన్ సరుకులు అన్నీ తీసుకెళ్లి వీధి చివరన ఆపేవారు. వార్డు ప్రజలంతా ఆ వాహనాల వద్దకు వచ్చి థంబ్ ముద్ర వేసి తమ రేషన్ సరుకులు తీసుకెళ్లేవారు. అప్పట్లో చాలా మంది ఇంతోటి దానికి ఇంటింటికీ రేషన్ అని పేరు ఎందుకు వాహనాల దాకా వచ్చిన వాళ్లం రేషన్ షాపుల వద్దకు రాలేమా అని జగన్ సర్కార్ పై దుమ్మెత్తిపోశారు. పైగా ఈ వాహనాల కొనుగోలు పేరిట జగన్ సర్కార్ కోట్లు ఖర్చుచేశారని..పైగా ఇంటింటికీ రేషన్ పథకం ద్వారా ప్రభుత్వానికి అదనంగా 1800 కోట్లు ఖర్చు అవుతూందని నివేదిక ఇచ్చారు బాబుకు.

వాహనాల దుర్వినియోగం

Advertisement

జగన్ కొనుగోలు చేసిన వాహనాలు అక్రమంగా రేషన్ తరలింపునకు ఉపయోగపడ్డాయని జనం బాహాటంగానే విమర్శించారు. వాహనాలలో కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటాడు. వార్డుకు సంబంధించిన రేషన్ డీలర్ ఈ డ్రైవర్ సహాయంతో రేషన్ సరుకులు అందించేవారు. ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే సిబ్బంది వైసీపీ కార్యకర్తలే అని..కేవలం తమ పార్టీవారికి లబ్ది చేకూరాలనే ఈ పథకాన్ని జగన్ అమలు చేస్తున్నారని అప్పట్లో టీడీపీ శ్రేణులు కూడా విమర్శించాయి. అయితే ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా గిరిజనులు ఉండే ప్రాంతాలకు, రాకపోకలు సవ్యంగా లేని ప్రదేశాలకు ఈ తరహా రేషన్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని చంద్ర బాబు ప్రభుత్వం భావిస్తోంది.

పాత పద్ధతి కంటిన్యూ

Advertisement

ఇకపై రేషన్ వస్తువులు తీసుకోవాలని భావించే వారు తప్పనిసరిగా పాత పద్ధతిలోన రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకోవాలనే ఆదేశాలు త్వరలోనే చేయబోతున్నట్లు సమాచారం. కేవలం రేషన్ షాపుల దందాను నియంత్రించడాని..అనవసర ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవడం ఉత్తమం అని పార్టీ శ్రేణులు కొందరు సూచిస్తున్నారు. ప్రజలకు ఏది ఆమోద యోగ్యమూ దానినే అనుసరించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రజాభిప్రాయం తీసుకుని ముందుకు వెళతారా లేక కీలక నిర్ణయం తీసుకుని ప్రభుత్వ అనవసర ఖర్చులు తగ్గించుకుంటారా అని అంతా ఎదురుచూస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×