E-Paper
Advertisement

Teacher Murder : రాజాంలో టీచర్ దారుణ హత్య.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..

Teacher Murder : రాజాంలో టీచర్ దారుణ హత్య.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..
Advertisement

Teacher murder news in ap today(Andhra news updates): విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రాజకీయ కారణాలతో టీచర్‌ను చంపడం దారుణమన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి హత్యలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.

ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణను దుండగలు బొలెరో వాహనంతో ఢీకొట్టి చంపేశారు. రాజాం సీఐ రవికుమార్‌, బాధిత కుటుంబసభ్యుల చెప్పిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం తన ఇంటి నుంచి కృష్ణ బైక్ పై తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు వెళుతుండగా ఈ హత్యకు గురయ్యారు. ఒమ్మి సమీపంలోని కొత్తపేట వద్ద నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Advertisement

మృతుడి కుమారుడు శ్రావణ్‌కుమార్‌ చేసిన ఫిర్యాదుతో ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకట నాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిపై కేసు నమోదు చేశామని సీఐ రవికుమార్‌ తెలిపారు. ఉపాధ్యాయుడు కృష్ణ అంత్యక్రియలు ఉద్దవోలులో నిర్వహించారు. ఆ గ్రామంలో పోలీసు పికెటింగ్‌ కొనసాగుతోంది.

కృష్ణ తెర్లాం మండలం ఉద్దవోలుకు 1988 నుంచి 1995 వరకు సర్పంచిగా సేవలందిచారు. ఆ తర్వాత 1998లో టీచర్ ఉద్యోగం వచ్చింది. 2021 ఎన్నికల్లో సర్పంచ్ గా సునీత నెగ్గారు. తర్వాత ఆమె వైసీపీలో చేరారు. అప్పటికే వైసీపీలో ఉన్న వెంకటనాయుడు పథకం ప్రకారమే కృష్ణను హత్య చేశారని మృతుడి భార్య జోగేశ్వరమ్మ, కుమారుడు శ్రావణ్‌కుమార్‌, కుమార్తె ఝాన్సీ, బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×