E-Paper
Advertisement

Chandrababu on CM Jagan: సైకో, నియంత పాలన అంతం కోసమే ఈ ఎన్నికలు: చంద్రబాబు

Chandrababu on CM Jagan: సైకో, నియంత పాలన అంతం కోసమే ఈ ఎన్నికలు: చంద్రబాబు
Advertisement

Chandrababu Sensational Comments on YS Jagan: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు జగన్ కు అభివృద్ధి అంటేనే తెలియదని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. జగన్ దోపిడీ చేయడంలో సామ్రాట్ అని ఎద్దేవా చేశారు.

వైసీపీ నేతలు రాష్ట్రంలోని భూగర్భ వనరులను దోచుకున్నారని అన్నారు. నూజివీడు నియోజకవర్గాన్ని కృష్టా జిల్లాలో కలపాలని ప్రజలు చాలా రోజులుగా పోరాడుతున్నారని తెలిపారు. స్థానిక ప్రజల కోరికను తప్పక నెరవేరుస్తా అని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు రూ. 10 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు.

Advertisement

అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపై, రెండవ సంతకం ల్యాండ్ గ్రాంబింగ్ యాక్టు రద్దుపైన పెడతానని చెప్పారు. ప్రజల భూములపై జగన్ అజమాయిషీ ఏంటని ప్రశ్నించారు. ప్రజల పాసు పుస్తకాలపై ఆయన ఫోటో ఎందుకు అని అన్నారు. సైకో జగన్ అందరి మెడకు ఉరితాడు వేసారని ఆరోపించారు.

Also Read: జగన్.. నువ్వంటే నాకు భయంలేదు.. నా సినిమాలు ఆపితే ఆపుకో: పవన్

Advertisement

వచ్చే ఎన్నికల్లో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని అన్నారు. రాతి యుగం పోయి స్వర్ణ యుగం రావాలని తెలిపారు. జగన్ పాలన అంతం కావాలంటే టీడీపీకి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. అమరావతిని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని అనుకున్నట్లు తెలిపారు. జగన్ అమరావతిని పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రాజధాని అయి ఉంటే నూజివీడు యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చేవని తెలిపారు.

అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నూజివీడు మీదుగా హనుమాన్ జంక్షన్ వరకూ వెళ్లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే అమరావతికి పూర్వ వైభవం వస్తుందని పేర్కొన్నారు. నూజివీడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను పేదల పక్షం అంటూ జగన్ ప్రజలను నమ్మిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేద ప్రజల జీవితాలను జగన్ నాశనం చేశారని ఆరోపించారు. జగన్ కు ప్యాలెస్ లు , ప్రజలకేమో పూరిళ్లా అని ప్రశ్నించారు. వేల కోట్లు సంపాదించుకున్న జగన్ పేదల ప్రతినిధి అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి అని ధ్వజమెత్తారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×