E-Paper
Advertisement

Chandrababu Called Jagan: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన.. జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు!

Chandrababu Called Jagan: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన.. జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు!
Advertisement

Chandrababu called to Former CM Jagan: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు ప్రముఖులకు ఇప్పటికే చంద్రబాబు ఆహ్వానం పంపారు. ఇటు మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి.. ఆహ్వానించే ప్రయత్నం చేశారు. అయితే, జగన్ తో మాట్లాడేందుకు చంద్రబాబు యత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాకూడదని వైఎస్సార్ సీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం.

కాగా, ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది. దాదాపు 175 వరకు సీట్లు వస్తాయని ఆశపడిన జగన్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఫలితాల తరువాత మీడియా ముందుకు వచ్చిన జగన్.. 11 సీట్లకే పరిమితం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement

ఇటు ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తియినట్లు తెలుస్తోంది. కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితోపాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: మన రాజధాని అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు

Advertisement

వీఐపీలో కోసం నాలుగు ప్రత్యేక గ్యాలరీలు, ప్రజల కోసం ఒక గ్యాలరీని.. మొత్తం ఐదు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 2 లక్షల మంది వరకు రావొచ్చంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం జాతీయ రహదారి పక్కనే నిర్వహిస్తున్న తరుణంలో హైవేపై పలు ఆంక్షలు కూడా విధించారు.

ఇదిలా ఉంటే.. నేడు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ముందుగా చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా కూటమిలోని మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×