E-Paper
Advertisement

TTD Chairman: శ్రీవారి దర్శనం తాజా అప్ డేట్.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

TTD Chairman: శ్రీవారి దర్శనం తాజా అప్ డేట్.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
Advertisement

TTD Chairman: భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా సహించను. కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగాలి. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు ముందస్తుగా తీసుకోండంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడుకు టీటీడీ ఈవో శ్యామల రావు అందించి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో అందించారు.

శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇక కార్తీకమాసం ఎఫెక్ట్ తిరుమలలో కనిపిస్తోంది. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.

Also Read: Rasi Phalalu Nov 17: ఏ ఏ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందంటే ?

Advertisement

కార్తీక మాసం ఎఫెక్ట్.. తిరుమలలో రద్దీ
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 73,179 మంది భక్తులు దర్శించుకోగా.. 25,602 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.03 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే 17 కంపార్ట్ మెంట్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×