E-Paper
Advertisement

AP Elections 2024: టెట్ ఫలితాలకు ఈసీ బ్రేక్.. డీఎస్సీ వాయిదా..

AP Elections 2024:  టెట్ ఫలితాలకు ఈసీ బ్రేక్.. డీఎస్సీ వాయిదా..
Advertisement

VolunteersVolunteers: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు ఎటువంటి డబ్బులు పంపిణీ చేయవద్దని ఆంక్షలు విధించింది.

దీంతో పాటులో రాష్ట్రంలో నిర్వహించబోయే డీఎస్సీని కూడా ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేస్తున్నట్లు ఆదేశాల్లో వెల్లడించింది. త్వరలోనే వెల్లడి కాబోయే ఏపీ టెట్ ఫలితాలను కూడా బ్రేక్ వేయాలని ఆదేశించింది.

Advertisement

వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు జిల్లా ఎన్నికల అధికార వద్ద వాటిని సబ్మిట్ చేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని లేఖ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. అవసరం తప్పదు అనుకుంటే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని సీఈసీ స్పష్టం చేసింది.

ఏప్రిల్ 3వ తేదీన పింఛన్ దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆంక్షలను విధించింది. సీఈసీ విధించిన ఈ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ దారులకు నగదు పంపిణీపై ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×