E-Paper
Advertisement

Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఈసారి ఏమి జరుగునో..?

Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఈసారి ఏమి జరుగునో..?
Advertisement

Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. నాలుగు రోజుల వ్యవధిలో అవినాష్ రెడ్డి రెండుసార్లు విచారణకు డుమ్మాకొట్టారు.

తొలుత ఈ నెల 16న అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ లోనే ఉన్న అవినాష్ రెడ్డి ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయంటూ సీబీఐకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చి పులివెందుల వెళ్లిపోయారు. అదే రోజు సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న విచారణ రావాలని కోరింది.

Advertisement

శుక్రవారం సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరుకాలేదు. తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని సీబీఐకు తన లాయర్ ద్వారా లేఖ పంపారు. తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నందున తల్లిని తాను చూసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మరి సీబీఐ తాజా నోటీసుల నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా..? రాకపోతే సీబీఐ తీసుకునే స్టెప్ ఏంటి..? దీనిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×