E-Paper
Advertisement

Vizag : మహిళా సీఐ దందా.. రూ. 2 వేల నోట్ల వ్యవహారంలో కేసు నమోదు..

Vizag : మహిళా సీఐ దందా.. రూ. 2 వేల నోట్ల వ్యవహారంలో కేసు నమోదు..
Advertisement

Vizag : ఏపీలో రూ.2 వేల నోట్ల మార్పిడి కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో
కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత, మరో ముగ్గురి నిందితులపై విశాఖ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. హోంగార్డులు శ్యామ్‌సుందర్ , శ్రీనుపైనా కేసులు నమోదయ్యాయి. నోట్ల మార్పిడి కేసులో మధ్యవర్తిగా సూరిబాబు అనే వ్యక్తి వ్యవహరించారు. అతడిపై విశాఖ ద్వారకా పోలీసులు 341, 386, 506 సెక్షన్ల కింద కేసులు ‌ నమోదు చేశారు.

సీతమ్మదార ప్రాంతంలో స్వర్ణలత రాత్రి విధుల్లో ఉండగా సూరిబాబు రూ.90 లక్షల విలువైన రూ.2వేల నోట్లతో పట్టుబడ్డాడు. దీంతో స్వర్ణలత సూరిబాబును బెదిరించారు. అందులోంచి రూ.12 లక్షలు తీసుకున్నారని దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ఈ విషయంలో నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్‌ విశాఖ నగర సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు విచారణను పోలీసులు చేపట్టారు. స్వర్ణలత బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×