E-Paper
Advertisement

Bus shelter : ప్రారంభానికి ముందే.. విశాఖలో ఒరిగిపోయిన బస్ షెల్టర్..

Bus shelter :  ప్రారంభానికి ముందే.. విశాఖలో ఒరిగిపోయిన బస్ షెల్టర్..
Advertisement

Bus shelter : విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తామని వైసీపీ ప్రభుత్వం కొంతకాలంగా పదే పదే ప్రకటనలు చేస్తోంది. నగరం నుంచే పాలన కొనసాగిస్తామని సీఎం వైఎస్ జగన్ చాలా వేదికలపై ప్రకటనలు చేశారు. దసరాకు సీఎం వైజాగ్ కు షిఫ్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది.

విశాఖకు రాజధాని రూపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వంపై అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విశాఖ మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మోడ్రన్‌ బస్‌ షెల్టర్ల నిర్మాణం చేపట్టింది. జీవీఎంసీ కార్యాలయం ఎదుట ఆర్టీసీ బస్‌ షెల్టర్‌ ను రూ. 40 లక్షలతో నిర్మించింది. ఈ బస్‌షెల్టర్‌ను త్వరలో ప్రారంభించాల్సి ఉంది.

Advertisement

ఈ బస్ షెల్టర్ తాజాగా పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ ఖర్చుతో నిర్మించిన బస్ షెల్టర్ కుంగిపోవడంపై విశాఖ వాసులు మండిపడుతున్నారు. షెల్టర్‌ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ఆరోపించారు. కుంగిన షెల్టర్‌ వద్ద ఆందోళన చేశారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×