E-Paper
Advertisement

Vijayawada: విజయవాడలో టీడీపీ- బీఆర్ఎస్ నేతల భేటీ, ఏం జరిగింది?

Vijayawada: విజయవాడలో టీడీపీ- బీఆర్ఎస్ నేతల భేటీ, ఏం జరిగింది?
Advertisement

Vijayawada: పైన ఫోటోలో కనిపిస్తున్న నేతలంతా ఒకప్పుడు టీడీపీలో ఉన్నవారే. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చెదిరిపోయారు. ఏపీ-తెలంగాణ నేతలుగా విడిపోయారు. ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉంటున్నారు. టీడీపీ-టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలు వారంతా.

ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించింది అలనాటి ఓబులాపురం మైనింగ్ కేసు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. 2007లో ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలు అడ్డగోలుగా జరిగాయి. అప్పటి వైఎస్ఆర్ సర్కార్‌కు మంత్రి గాలి జనార్థన్‌రెడ్డికి గనులు దోచిపెడుతోందని ఆరోపిస్తూ నేతలంతా ఆందోళనకు దిగారు. అప్పట్లో ఆయా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

అందుకు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం మంగళవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు ఆయా నేతలంతా. విచారణ జనవరి 8కి వాయిదా పడింది. న్యాయస్థానం ముందు హాజరైన వారిలో మంత్రి అచ్చెన్నాయుడు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు.

వీరితోపాటు బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, నాగం జనార్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీబీ రాజేంద్రప్రసాద్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావు, చినరాజప్ప, పడాల అరుణ, అమర్నాథ్ రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు.

Advertisement

ALSO READ:  ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌‌‌పై ఏసీబీ కేసు నమోదు

ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నోరు విప్పారు. తామంతా స్నేహితులమని, గతంలో టీడీపీలో పని చేశామని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో ఉన్నా, అందరూ ప్రజాసేవలో ఉన్నామన్నారు. ఆ తర్వాత ఏపీ-తెలంగాణ రాజకీయాల గురించి చిన్నపాటి చర్చ జరిగినట్టు ఓ వార్త గుప్పుమంది.

తెలుగు రాష్ట్రాలకు గురుశిష్యులిద్దరు ఒకేసారి ముఖ్యమంత్రులు అయ్యారని, నిజాయితీగా ఉంటే అవకాశాలు తప్పకుండా వస్తాయని అన్నారట. దూకుడుగా వెళ్తున్నారంటూ మాట్లాడుకున్నారట. ప్రజా సేవ చేస్తే నాలుగు కాలాలపాటు ప్రజల మనసులో ఉండిపోతారని చెప్పుకుంటూ హాయిగా నవ్వుకున్నారు ఆయా నేతలంతా. ఆ తర్వాత నేతలంతా తమ వాహనాలు తిరిగి హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×