E-Paper
Advertisement

Botsa Jhansi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ?

Botsa Jhansi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ?
Advertisement

Botsa Jhansi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్యసత్యనారాయణ సతీమణి డాక్టర్‌ ఝాన్సీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విశాఖ ఎంపీగా ఉన్న ఎంవివీ సత్యనారాయణ ఈస్ట్ అసెంబ్లీకి పోటీ చేస్తుండడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం.. సుదీర్ఘ చర్చల అనంతరం బొత్స ఝాన్సీని నిలబెట్టాలని నిర్ణయించింది. ఉన్నత విద్యావంతురాలు కావడంతోపాటు.. ఉత్తరాంధ్ర కాపు సామాజికవ వర్గం కావడం సానుకూల అంశంగా భావించింది. దీంతోపాటు రాజకీయ అనుభవం ఉండటంతో బొత్స ఝాన్నీని ఎంపీ అభ్యర్థిగా ఎంపికి చేసినట్టు సమాచారం. గతంలో జడ్పీ చైర్మన్‌గా, రెండుసార్లు లోక్ సభ ఎంపి గా పని చేశారు.

కాగా.. ఝాన్సీ పోటీ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందన్న ఆలోచనలో ఉంది అధికార పార్టీ. స్థానిక బీసీ నేతకు సీటు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలోని 80 శాతం బీసీలను ప్రభావితం చేయవచ్చని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్‌ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్నీ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఝాన్సీ అభ్యర్థిత్వంతో మిగతా పార్టీలు కూడా బీసీ నేతలకు ఇవ్వాల్సి వస్తుందన్న రాజకీయ ఎత్తుగడ కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు విశాఖ లోక్‌సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారే ఉన్నారు. 2004 లో నేదురుమల్లి, 2009లో పురంధరేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ ఎంపీగా ఎన్నికయ్యారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×