E-Paper
Advertisement

Mangalagiri : మంగళగిరిలో బాప్టిజం ఘాట్.. బీజేపీ ఎంట్రీతో రచ్చ రంబోలా.. హైకోర్టు స్టే..

Mangalagiri : మంగళగిరిలో బాప్టిజం ఘాట్.. బీజేపీ ఎంట్రీతో రచ్చ రంబోలా.. హైకోర్టు స్టే..
Advertisement
 Mangalagiri

Mangalagiri : ప్రశాంతంగా ఉండే మంగళగిరిలో ప్రస్తుతం కులాల కుంపటి రాజుకుంటోంది. గతంలో కనీసం రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఎక్కడ లేని ఓ కార్యాచరణకు అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీకారం చూట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అతని ఆదేశాలతో అధికారులు చేసిన పని విమర్శలు, వివాదాలకు కారణమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మంగళగిరిలోని బాప్టిజం ఘాట్ విషయంలో ఆది నుంచి వివాదాలు నడుస్తున్నాయి. గతంలో మత మార్పిడి కోసం ఏదైనా నదిలో కాని.. పారుతున్న కాల్వలో కాని బాప్టిజం చేసేవారు. ఆ తర్వాత క్రిస్టియన్‌ మతంలోకి తీసుకునే వారు. కొన్నిసార్లు నదీ స్నానాల విషయంలో వివాదాలు తలెత్తాయి. బాప్టిజం చేసే వారికి ఇతర మతాల వారికి గొడవలు జరిగేవి. ఘర్షణ వాతావరణం ఏర్పడేది. వివాదాలు ముదిరి అరెస్టుల వరకు వెళ్లిన ధాఖలాలు ఉన్నాయి.

Advertisement

తాజాగా ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే వ్యక్తి బాప్టిజం ఘాట్ కావాలని అడిగారట. అంతే దాన్ని కార్యాచరణలోకి తీసుకుని చట్ట ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు సమీపంలో స్థలం కేటాయించాలని అధికారులకు అదేశాలు వెళ్లాయి. సదరు వ్యక్తులు కూడా అర్జీ పెట్టుకోవడంతో స్థలం కేటాయించడం చకచకా జరిగిపోయాయి. అప్పటి వరకు రహస్యంగా పనులు జరిగాయి. అసలు విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేతలు, హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి.

గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. బీజేపీ నేతలు ఘాట్ నిర్మాణం కోసం వేసిన పిల్లర్లను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో స్వల్ప వివాదం తీవ్ర స్థాయిలోకి చేరింది. దానిపై స్థానిక క్రైస్తవులు ఎమ్మెల్యేకు విషయం చేరవేశారట. అంతే పోలీస్ బలగాలు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఘాట్ పనులను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికార పార్టీ ప్రజాప్రతినిధి హెచ్చరించారు. రెండు రోజుల క్రితం జరిగిన పరిణామాల తర్వాత బీజేపీ నేతలు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. అది కూడా బెడిసి కొట్టింది. దీంతో బీజేపీ నేతలకు ఆగ్రహం మరింత పెరిగి నేరుగా కమిషనర్, ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే ప్రభుత్వం, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తీరుపై పోరాటం తప్పదని హెచ్చరించారు. పనులు ఆపకపోతే ఘాట్‌ను కూల్చటం ఖాయమని హెచ్చరించారు.

Advertisement

బాప్టిజం ఘాట్ విషయంలో బీజేపీ నేతలు కావాలనే రాద్దాంతం చెస్తున్నారని క్రైస్తవులు విమర్శలు చేస్తున్నారు. బాప్టిజం అంటే తెలియని వాళ్లు మత మార్పిడి అనటం అవివేకం అంటున్నారు. కావాలనే ఘాట్ పనులను అడ్డుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. దేవుని కృపను చూపించిన వారికి వారి మనస్సును మాత్రమే మార్చుకోవటానికి ఘాట్ పనులను చేపట్టామని అంటున్నారు. బీజేపీ నేతలు ఆరోపిస్తునట్టు మత మార్పిడికి కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా ఘాట్ నిర్మించి తీరతామని క్రిస్టియన్‌ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

కుల, మతాలు వంటి సున్నితమైన అంశాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ఒక మతాన్ని సపోర్ట్‌ చేసేలా అధికారులకు ఆదేశాలు ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

వివాదం ముదిరి హైకోర్టుకు చేరింది. మంగళగిరిలో బాప్టిజం ఘాట్‌ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న బాప్టిజం ఘాట్ నిలిపివేతకు ఆదేశాలు జారీ చేసింది. బాప్టిజం ఘాట్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలని హిందూ సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఘాట్ నిర్మాణంపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×