E-Paper
Advertisement

Balineni Srinivas Reddy : పంతం నెగ్గించుకున్న బాలినేని.. తాడేపల్లికి ఎస్పీ మల్లిక

Balineni Srinivas Reddy : పంతం నెగ్గించుకున్న బాలినేని.. తాడేపల్లికి ఎస్పీ మల్లిక
Advertisement

Balineni Srinivas Reddy : ఒంగోలులో పోలీసుల తీరుపై ఆగ్రహంతో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. పంతం నెగ్గించుకున్నారు. ఓ కేసు విషయంలో పోలీసుల తీరును నిరసిస్తూ.. గురువారం నుంచి సీఎంవోలోనే ఉన్నారు. స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. ఎస్పీ మల్లిక ఘర్గ్‌ను తాడేపల్లి రావాలని ఆదేశించింది. నకిలీ స్టాంప్స్ కేసుల్లో పోలీసుల తీరును నిరసిస్తూ .. బాలినేని తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. గురువారం సీఎంను కలవాలని యత్నించినా..తొలుత సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. జగన్‌ ఎమ్మిగనూరు పర్యటనలో ఉన్న నేపథ్యంలో బాలినేని.. ఆయన్ను కలవడం కుదరలేదు. సీఎం ఆదేశాల మేరకు.. ధనుంజయ్‌ రెడ్డిని కలవాలని సీఎం ఆదేశించగా.. ఆయన్ను కలసి తాజా పరిస్థితులను వివరించారు.

కొన్నిరోజులుగా తన మాటకు విలువలేదంటూ బాలినేని అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో.. జిల్లా ఎస్పీకి పిలుపురావటంతో మల్లికఘర్గ్‌ తాడేపల్లి చేరుకున్నారు. దీంతో ఇరువురితో సీఎంవో కార్యాలయం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్ అపాయింట్ మెంట్ నిరాకరించడంతో అధిష్టానం ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే బాలినేని పార్టీ మారుతారా లేక రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా తెలియాలంటే.. ఇంకొన్ని నెలలు వేచిచూడాల్సిందే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×