E-Paper
Advertisement

BTech Ravi: వివేకా మర్డర్ కేసు.. అవినాష్ రెడ్డి ఆరోపణలపై.. బీటెక్ రవి సెన్సేషనల్ కామెంట్స్

BTech Ravi: వివేకా మర్డర్ కేసు.. అవినాష్ రెడ్డి ఆరోపణలపై.. బీటెక్ రవి సెన్సేషనల్ కామెంట్స్
Advertisement

కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని హరిజనవాడలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి పర్యటించారు. అక్కడ నిర్మించ తలపెట్టిన ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమం అనంతరం హరిజనవాడకు చెందిన 20 కుటుంబాలు బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీటెక్ రవి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.

అవినాష్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లు చూస్తుంటే ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలనిపిస్తోందని బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా మరణం తర్వాత గుండెపోటు అనే పదాన్ని తొలుత సృష్టించి వాడుకున్నది అవినాష్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. హత్య జరిగిన చోటుకు వెళ్లి సాక్ష్యాలను తారుమారు చేసిన వ్యక్తులు ఈరోజు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్పాట్ నిర్ణయించింది, అక్కడికి వెళ్లింది, ఆపై క్లీన్ చేసింది అంతా వైసీపీ నాయకులేనని ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేస్తే ఎదుర్కోవాల్సిన సెక్షన్ 201 తీవ్రత ఏంటో ఎంపీకి తెలుసా అని నిలదీశారు. చేసిన తప్పుల నుంచి ఆయన ఎప్పటికీ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

Advertisement

వివేకా కుమార్తె సునీత గురించి అవినాష్ మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని రవి మండిపడ్డారు. సునీతే గుండెపోటు అని చెప్పారని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఆమె చంద్రబాబుకు సహకరిస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందని కొట్టిపారేశారు. చంద్రబాబుకు సునీత సహకారం అవసరం లేదని చెప్పారు. నిజానికి సునీతకు రాజకీయ కోరిక ఉండి ఉంటే ఈరోజు అవినాష్ రెడ్డి ఎంపీ అయ్యేవాడే కాదని గుర్తు చేశారు. ఆమె పెట్టిన రాజకీయ భిక్ష వల్లే అవినాష్ పదవిలో ఉన్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

హత్య కేసులో ముద్దాయిగా ఉండి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తికి వివేకా కేసు గురించి మాట్లాడే అర్హత లేదని బీటెక్ రవి స్పష్టం చేశారు. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, చేసిన పాపాలు ఏదో ఒక రోజు వెంటాడుతాయని హెచ్చరించారు. అవినీతికి పాల్పడినందు వల్లే సీఐ అశోక్ రెడ్డి సస్పెండ్ అయ్యారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Advertisement

ALSO READ: Longest Beaches: ప్రపంచంలో అత్యంత పొడవైన బీచ్ లు ఇవే, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×