E-Paper
Advertisement

YS Sharmila : నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా ‘రచ్చబండ’.. పాల్గొననున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల..

YS Sharmila : నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా ‘రచ్చబండ’.. పాల్గొననున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల..
Advertisement
YS Sharmila Latest news

YS Sharmila latest news(Andhra pradesh election news): ఏపీ ఎన్నికల్లో అధికారమే టార్గెట్‌గా కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల దూకుడు పెంచారు. జగన్‌ పాలనపై వ్యతిరేకతను పెంచి ఓటర్లను తమవైపుకు తిప్పుకునే వ్యూహంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రాంను నేడు బాపట్ల నుంచి ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు షర్మిల. ఆ తర్వాత గురువారం తెనాలి నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరులో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు.

అలాగే 9న ఉదయం కొవ్వూరులో రచ్చబండ, సాయంత్రం 5 గంటలకు తునిలో బహిరంగ సభ, 10వ తేదీన ఉదయం నర్సీపట్నంలో రచ్చబండ , సాయంత్రం పాడేరులో బహిరంగ సభ, 11 న నగరిలో బహిరంగ సభలో పాల్గొంటారు.

Advertisement

APCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం షర్మిలకు భద్రత పెంచాలని మంగళవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీమతి షర్మిల భద్రతను 4+4 నుంచి 1+1కి తగ్గించారని వారు ఆయనకు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆమె బహిరంగ సభలలో రాష్ట్ర ప్రజల బాధల గురించి వివిధ అంశాలలో గళం విప్పినందుకే ఈ చర్య తీసుకున్నారని తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×