E-Paper
Advertisement

AP Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో తుపాను.. ఏపీపై ఎఫెక్ట్ ?

AP Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో తుపాను.. ఏపీపై ఎఫెక్ట్ ?
Advertisement
AP Weather Update

AP Weather Update:

దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం (నవంబర్ 29) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మరోవైపు ఏపీలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. కాగా.. ఇంకొక్క నెలరోజుల్లో పంట చేతికొస్తుందనగా.. అకాల వర్షసూచన రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. వర్షాలు పడితే పంటంతా వర్షార్పణమైపోతుందని ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడా పడుతున్న వర్షాలతో.. కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి.. వాటిని ఆరబెట్టుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతన్న దిగులు చెందుతున్నాడు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×