E-Paper
Advertisement

AP: మళ్లీ ‘ప్రత్యేక హోదా’.. వైసీపీ వ్యూహమేంటి?

AP: మళ్లీ ‘ప్రత్యేక హోదా’.. వైసీపీ వ్యూహమేంటి?
Advertisement

AP: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా.. ఎప్పుడో కనుమరుగైన అంశం. మళ్లీ లేవనెత్తింది వైసీపీ. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మరోసారి ‘ప్రత్యేక’ ప్రస్తావన తీసుకొచ్చింది.

అప్పుడప్పుడు ఢిల్లీ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం పలువురు వైసీపీ నాయకుల నోళ్లలో నానుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను ప్రస్తావించారు. కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.

Advertisement

అలాగే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి అన్నారు. బెంగళూరు మెట్రోకు కేటాయించినట్లుగానే విశాఖ మెట్రోకు కేంద్రం నుంచి 20 శాతం నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభ్యంతరం తెలిపారు.

ప్రత్యేక హోదాను వైసీపీ వదిలేయలేదని గుర్తు చేయడానికే.. ఇలా అప్పుడప్పుడూ స్పెషల్ స్టేటస్ గొంతుక వినిపిస్తుంటారు ఆ పార్టీ ఎంపీలు. ప్రధాని మోదీని సీఎం జగన్ కలిసిన ప్రతీసారి ఆయన ఇచ్చే డిమాండ్ల జాబితాలో ఏపీకి ప్రత్యేక హోదా అనే పదం జత చేస్తూ ఉంటారు. ఇక అంతే. మళ్లీ సైలెన్స్. ఇదంతా రొటీన్ గా చేసే డిమాండేనంటూ లైట్ తీసుకుంటున్నారు ఏపీ ప్రజలు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×