E-Paper
Advertisement

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Advertisement

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం (02-12-2025) ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు నెల్లూరు జిల్లా కొడవలూరులో 38.7మిమీ, నెల్లూరులో 36.7మిమీ, తిరుపతి జిల్లా తడలో33.5 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది.

Advertisement

వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి తీవ్రత ఎక్కువైంది. గత రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరో మూడ్రోజులు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం మీదుగా కదులుతోందని వెల్లడించింది. దిత్వా తుపాను చెన్నైకి 50 కి.మీ, పుదుచ్చేరికి 130 కి.మీ, నెల్లూరుకి 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాబోయే మూడ్రోజులు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

Advertisement

Also Read: Rajole: రాజోలు.. గ్లాస్ పార్టీలో గందరగోళం 

యథావిధిగా స్కూళ్లు

దిత్వా తుపాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అయితే తుపాను బలహీనపడడంతో రేపు విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×