E-Paper
Advertisement

Ysrcp Vs Janasena: ‘వెన్నుపోటు’కి కౌంటర్ గా ‘పీడ విరగడైంది’..

Ysrcp Vs Janasena: ‘వెన్నుపోటు’కి కౌంటర్ గా ‘పీడ విరగడైంది’..
Advertisement

గతేడాది జూన్-4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దీన్ని వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని వైసీపీ నిర్ణయంచింది. పోస్టర్లు కూడా రిలీజ్ చేసింది. దీనికి కౌంటర్ గా కూటమి ‘పీడ విరగడైంది’ పేరుతో అదే రోజు ఉత్సవాలు జరపాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఇది జనసేన నిర్ణయం. డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో మంత్రి నాదెండ్ల మనోహర్.. ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. జనసైనికులతోపాటు కూటమి నేతలంతా ‘పీడవిరగడైంది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వెన్నుపోటు..
ఇటీవల లిక్కర్ స్కామ్ గురించి సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం జగన్.. చివర్లో జూన్-4న వెన్నుపోటు దినోత్సవంగా వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపడతాయని పిలుపునిచ్చారు. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన జరగనుంది. జూన్-4న ఎన్నికల ఫలితాలు రావడంతో అదే రోజు వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామంటున్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, అదే ప్రజలకు వారు పొడిచిన వెన్నుపోటు అంటున్నారు వైసీపీ నేతలు. ఈ మేరకు ఈ కార్యక్రమం కోసం ప్రతి జిల్లాలో వాల్ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఆరోజు నాయకులంతా కలెక్టరేట్లకు వెళ్లి అక్కడ వినతిపత్రాలు ఇస్తారు. అనంతరం నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు ఉంటాయి.

Advertisement

కూటమి కౌంటర్..
వాస్తవానికి కూటమి పాలనకు ఏడాది అంటే అది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునుంచి మొదలు కావాలి. కానీ వెన్నుపోటు అంటూ వైసీపీ ముందుగానే హడావిడి మొదలు పెట్టడంతో కూటమి నేతలు కూడా తమ కార్యక్రమాలను ముందుకు మార్చుకున్నారు. ఫలితాలు వచ్చిన రోజే తాము ‘పీడ విరగడైంది’ అనే కార్యక్రమం చేస్తామంటున్నారు. ఆ రోజు ఏపీ ప్రజలకు వైసీపీ ‘పీడ విరగడైంది’ అనేది వారి అభిప్రాయం. అప్పటి నుంచి ప్రజలకు మంచి పాలన అందుతోందని కూటమి నేతలు చెబుతున్నారు. సుపరిపాలన ప్రారంభమై ఏడాది.. రాష్ట్రానికి వైసీపీ పీడ విరగడై ఏడాది అంటూ, ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండగ జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది.

Advertisement

ఈ కార్యక్రమాలకు జనసేన లీడ్ తీసుకోవడం ఇక్కడ విశేషం. డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో.. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దిశా నిర్దేశం చేసింది. ఆ రోజు జనసేన నేతలు, శ్రేణులు తమ వాకిళ్లను అందమైన రంగవల్లులతో అలంకరించాలనీ, ముగ్గుల పోటీలు కూడా నిర్వహించాలనీ పార్టీ ఆదేశించింది. సాయంత్రం దీపావళి తరహాలో దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చాలని నేతలకు సూచించారు. అంటే ఇక్కడ సంక్రాంతి-దీపావళి కలిపి నిర్వహించాలనేది వారి ముఖ్య ఉద్దేశం. ఈ వేడుకల ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తిపోవాలని కూడా సూచనలు అందాయి. డిజిటల్ క్యాంపెయిన్‌ ద్వారా ప్రజలు వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమాన్ని మరచిపోవాలని, దానికి తగ్గట్టుగా ట్రెండింగ్ మొదలు పెట్టాలని కూడా జనసైనికులకు ఆదేశాలందాయి. మరోవైపు వెన్నుపోటు దినోత్సవానికి రెడీ అవుతున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ వెన్నుపోటు దినోత్సవానికి సహజంగానే అనుమతులు లభించవు. అనుమతులు లేకుండా రోడ్డెక్కితే పోలీసులు చూస్తూ ఊరుకోరు. అంటే.. జూన్-4న ఏపీలో పెద్ద రణరంగమే జరగబోతోందని తేలిపోయింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×