E-Paper
Advertisement

AP Pensions 2024: ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి మూడు నెలల నగదు.. మరో విశేషం ఏమిటంటే?

AP Pensions 2024: ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి మూడు నెలల నగదు.. మరో విశేషం ఏమిటంటే?
Advertisement

AP Pensions 2024: ఏపీలోని సామాజిక పింఛన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్ నగదును పెంచి పంపిణీ చేస్తుండగా, తాజాగా ప్రకటించిన శుభవార్తతో పెన్షన్ దారులకు మరో వెసులుబాటు కల్పించినట్లు భావించవచ్చు.

ఏపీ ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ నగదు పంపిణీ పై వరాల జల్లు కురిపించారు. తాను పెన్షన్ దారులకు హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, పెన్షన్ నగదును పెంచి పంపిణీ చేశారు. వృద్ధాప్య, వితంతు పెన్షన్ దారులకు రూ.3 వేలు పింఛన్ నగదు గతంలో అందిస్తుండగా, అందుకు రూ.1000 లు పెంచిన ప్రభుత్వం, 3 నెలల యొక్క అదనంగా రూ.1000 చొప్పున చొప్పున మొత్తం రూ. 7000 అందించారు.

Advertisement

ఇక వికలాంగులకు రూ.3000 పెన్షన్ నగదు పంపిణీ చేస్తుండగా, వారికి ఏకంగా రూ.6000లు ప్రభుత్వం పంపిణీ చేసింది. సచివాలయ సిబ్బందిని ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్ దారుల గృహాలకు పంపించి ఈ నగదును పంపిణీ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వము పెన్షన్ దారులకు మరో వెసులుబాటు సైతం కల్పించడం విశేషం.

గతంలో పెన్షన్ నగదును రెండు నెలల పాటు వరుసగా తీసుకోని పింఛన్ దారునికి నగదు చెల్లించడంలో ఇబ్బందులు ఉండేవి. అటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ప్రస్తుతం 2 నెలల పాటు పింఛన్ తీసుకోకపోయినా, 3 నెలలో ఒకేసారి మొత్తం చెల్లించాలని నిర్ణయించింది. అంటే వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకొని పింఛన్ దారునికి మూడో నెలలో 3 నెలలకు సంబంధించిన నగదును సచివాలయ సిబ్బంది అందజేస్తారు.

Advertisement

Also Read: Today Horoscope: నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. !

అంతేకాకుండా పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే భార్యకు మరుసటి నెలలోనే వితంతు పింఛన్ మంజూరయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తమకు ఇంతటి వెసులుబాటు కల్పించడంపై పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వితంతువులు తమకు కల్పించిన వెసులుబాటుపట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×