E-Paper
Advertisement

Ganja Chocolates: మీ పిల్లలు చాక్లెట్స్ తింటున్నారా.. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి

Ganja Chocolates: మీ పిల్లలు చాక్లెట్స్ తింటున్నారా.. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి
Advertisement

Ganja Chocolates: మీ పిల్లలు చాక్లెట్ తింటున్నారా.. రోజూ అవే చాక్లెట్స్ కావాలంటూ మారాం చేస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. చాక్లెట్ తరహాలో ఎన్నో మత్తు పదార్థాలు మీ పిల్లల చెంతకు చేరే అవకాశం ఉంది. మీ పిల్లలు తినే చాక్లెట్స్ మీరే స్వయంగా చెక్ చేసి ఇవ్వడం మంచిదంటున్నారు పోలీసులు. వారి ప్రకటన వెనుక పెద్ద కారణమే ఉంది. అందుకే ప్లీజ్ బీ అలర్ట్. అయితే ఇంతలా పోలీసుల ప్రకటన వెనుక ఉన్న ఆ కారణం ఏమిటో తెలుసుకుందాం.

ఏపీలో మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఈగల్ ను ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గంజాయి వాసన వస్తే అక్కడ పోలీసులు వాలుతున్నారు. ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసినా, విక్రయించినా చట్టరీత్యా కఠినచర్యలు ఉంటాయని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనితో పోలీసుల వేట మరింత ముమ్మరంగా సాగుతోంది. ఈ దశలోనే ఓ పెద్ద ముఠాను పల్నాడు జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

Advertisement

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒరిస్సాకు చెందిన ఉదయానంద్ చిన్న బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నాడు. ఆ బడ్డీ కొట్టు ఏర్పాటు చేసుకున్న ఉదయానంద్ చిన్నగా గంజాయి విక్రయాలు కూడ ప్రారంభించి జోరుగా సాగిస్తున్నాడు. అది కూడా చాక్లెట్స్ రూపంలో విక్రయాలు జరపడం విశేషం. ఇక్కడ ఎందరో చిన్నారులు కూడా కొనుగోలు చేసేవారట. మరి విక్రయించాడో లేదో కానీ పోలీసులు మాత్రం నిఘా ఏర్పాటు చేసి రెడ్ హ్యాండెడ్ గా అతడిని పట్టుకున్నారు. ఇక్కడ దొరికిన చాక్లెట్స్ లో 14 శాతం గంజాయి ఉందని తాము గుర్తించామని, అలాగే గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.

Also Read: Prakasam District News: బడి మారినా వదలని టీచర్.. బాలికతో అసభ్యప్రవర్తన.. దిమ్మతిరిగే తీర్పునిచ్చిన కోర్టు

Advertisement

10 నెలల క్రితం బ్రతుకు జీవుడా అంటూ నరసరావుపేటకు వచ్చిన ఉదయానంద్ చేస్తున్న వ్యాపారం తెలుసుకున్న స్థానికులు బిత్తరపోయారు. అసలు ఇంకా పెద్ద ముఠా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తమ పూర్తి దర్యాప్తు సాగుతుందని పల్నాడు పోలీసులు తెలిపారు. ఏదిఏమైనా చిన్నారులు ఇష్టంగా చాక్లెట్స్ ని కూడా మత్తు పదార్థాలుగా మార్చారంటే, మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×