E-Paper
Advertisement

Nara Lokesh: విద్యాశాఖ అధికారులతో లోకేశ్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Nara Lokesh: విద్యాశాఖ అధికారులతో లోకేశ్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
Advertisement

Nara Lokesh latest news(Political news in AP): ప్రయివేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందించాలని తెలిపారు. సాల్ట్ ప్రాజెక్టుపై శుక్రవారం పాఠశాల విద్యాధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రాజెక్టు అమలు తీరుపై పాఠశాల విద్యాధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో లోకేశ్ సమీక్ష నిర్వహించారు.

నాడు-నేడు, సాల్ట్ వంటి పథకాలపై గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేవలం కాగితాల్లో మాత్రమే చూపుతోందని అన్నారు. అదే నిజమైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారి సంఖ్య ప్రస్తుతం 2 లక్షలకు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. దీనిపై లోతైన విశ్లేషణ చేసి, నాణ్యమైన విద్య అందించి.. మైరుగైన ఫలితాలు పొందడం కోసం చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ ఆదేశించారు. అంతే కాకుండా ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఎసె‌స్మెంట్ మరింత శాస్త్రీయంగా ఉండే విధంగా డిజైన్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. డిటిటలైడ్జ్ ఎసె‌స్మెంట్ మరింత సమర్థవంతంగా నిర్వహించి, ఆన్ లైన్‌లో అనుసంధానంపై దృష్టి సారించాలని ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ సంస్థను మంత్రి ఆదేశించారు.

Also Read: నాకు ఏ దిక్కూ లేక దువ్వాడకు దగ్గరయ్యా: మాధురి

Advertisement

టీచింగ్ టూల్స్ అబ్జర్వేషన్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ బోధనా పద్ధతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతే కాకుండా ఆయా ఎజెన్సీలు నిర్వహిస్తున్న ఎసె‌స్‌మెంట్, శిక్షణా కార్యక్రమాలు అర్థవంతగా, ఫలితాల మెరుగుదలకు దోహదపడేలా ఉండాలని అన్నారు. ఇంటర్ మీడియట్‌లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×