E-Paper
Advertisement

Vasudevareddy arrest: జగన్‌కు మరిన్ని కష్టాలు.. మెడకు లిక్కర్ స్కామ్.. వాసుదేవరెడ్డి అరెస్ట్!

Vasudevareddy arrest: జగన్‌కు మరిన్ని కష్టాలు.. మెడకు లిక్కర్ స్కామ్.. వాసుదేవరెడ్డి అరెస్ట్!
Advertisement

Vasudevareddy arrest: వైసీపీ అధినేత జగన్‌కు కష్టాలు రెట్టింపయ్యాయా? పదే పదే జగన్ బెంగుళూరు వెళ్లడం వెనుక అసలేం జరుగుతోంది? ఏపీ బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారా? ఈ కేసు అధినేత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? ఏపీలో వైసీపీ పనైపోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ గగ్గోలు పెట్టింది. ఇందులో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే బలంగా చెబుతోంది. ఏపీలో అధికార మారగానే బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి తట్టా బుట్టా (హార్డ్ డిస్క్‌లు, ఫైల్స్) సర్దుకుని ఏపీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. కీలకపత్రాలను స్వాధీనం చేసుకుంది. వాసుదేవరెడ్డి ఆచూకీపై సీఐడీ కన్నేసింది.

Advertisement

వైసీపీ అధినేత జగన్ చీటికీ మాటికీ బెంగుళూరు వెళ్లడం, వాసుదేవరెడ్డి ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా సీఐడీ అధికారులు దృష్టి సారించారు. బెంగుళూరులో జగన్ యలహంక ప్యాలెస్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో వాసుదేవరెడ్డి మకాం పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వాసుదేవరెడ్డి ఆచూకీ గురించి తెలియడంతో బెంగుళూరు వెళ్లారు సీఐడీ అధికారులు.

ALSO READ:  బొత్సని ఇరికించిన జగన్.. పెద్ద ప్లానింగే..

Advertisement

లాయర్లతో కలిసి మాజీ ఎండీ వాసుదేవరెడ్డి హోటల్‌కి వెళ్లడాన్ని సీఐడీ అధికారులు గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అరెస్టు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. విచారణలో ఆయన కీలక విషయాలు బయటపెట్టినట్టు వార్తలు జోరందుకున్నాయి.

మద్యం పాలసీ నిర్ణయాలు.. విక్రయాలు, ముడుపులు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు, పర్సెంటేజీలు వ్యవహారంపై విషయాలు బయటపెట్టినట్టు సమాచారం. వాసుదేవరెడ్డి బయటపెట్టిన వివరాలతో మరికొంత మందిని విచారించాలని అధికారులు భావిస్తున్నారు. పనిలోపనిగా డిస్టలరీ యజమానులను సైతం విచారించాలని ఆలోచన చేస్తోందట సీఐడీ.

ఈ వ్యవహారంతో జగన్‌కు లింకులుంటే ఇరుక్కోవడం ఖాయమన్నది టీడీపీ నేతల మాట. కోట్ల రూపాయలు మారినట్టు తెలుస్తోంది. వీలైతే ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఏపీలో వైసీపీ పనైపోయినట్టేనని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో మార్పులు చేయాలని జగన్ భావిస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×