E-Paper
Advertisement

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో న్యూ ట్విస్ట్.. ఫామ్ హౌస్‌ని రౌండప్ చేసిన అధికారులు, రూ.11 కోట్లు సీజ్

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో న్యూ ట్విస్ట్.. ఫామ్ హౌస్‌ని రౌండప్ చేసిన అధికారులు, రూ.11 కోట్లు సీజ్
Advertisement

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది? కుంభకోణంలో కూడబెట్టిన ముడుపుల సొమ్ములు, బంగారం హైదరాబాద్‌లో దాచి పెట్టారా? తొమ్మిది డెన్లలో ఏడు హైదరాబాద్‌లో ఉన్నాయా? వాటిలో ఒకటి బయట పడిందా? మిగతా ఆరు డెన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? అక్కడ ఏ స్థాయిలో డబ్బు నిల్వచేశారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు. సిట్ అదుపులో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌‌లో ఓ ఫామ్‌హౌస్‌పై సిట్ అధికారులు సోదాలు చేశారు. అక్కడ నోట్ల కట్టలు చూసి అధికారులు షాకయ్యారు. ఒకటి రెండు కాదు ఏకంగా 11 కోట్ల రూపాయలను సీజ్ చేశారు.

Advertisement

వాటిని లెక్కించేందుకు అధికారులు యంత్రాలు తీసుకొచ్చారు. ఈ కేసులో A-1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి-వరుణ్ సమాచారం మేరకు ఆ మొత్తాన్ని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్‌ గెస్ట్‌‌హౌస్‌లో నగదు డంప్‌ను గుర్తించారు. లిక్కర్‌ కేసులో ఏ-40 వరుణ్‌ పురుషోత్తం ఉన్నారు.

ఇటీవల అదుపులోకి తీసుకున్న అధికారులు, అతడు ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. నగదు వ్యవహారంలో చాణక్య-వినయ్‌ పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతేడాది అంటే 2024 జూన్‌లో ఆ డబ్బును దాచినట్లుగా తెలుస్తోంది. ఆ గెస్ట్‌హౌస్ సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ తగల బాల్‌రెడ్డి పేరు మీద ఉంది.

Advertisement

ALSO READ: ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఆ రోజే కొత్త రేషన్ కార్డుల పంపిణీ

లిక్కర్ కుంభకోణం వెలుగులోకి రాగానే ముడుపుల ద్వారా సేకరించిన నిధులు, బంగారం 9 డెన్లలో పెట్టినట్టు తెలుస్తోంది. అందులో దుబాయ్, తాడేపల్లిలో ఒకొక్కటి, హైదరాబాద్ 7 ఉన్నట్లు తేలింది. వాటిలో ఒకటి మాత్రమే హైదరాబాద్‌లో బయటకు వచ్చింది. మిగతా ఆరు డెన్లు ఎక్కడ ఉన్నాయి? అనేది తేలనుంది.

మిగతా డెన్లను గుర్తిస్తే ఇంకెన్ని నిధులు పట్టుబడతాయనేది ప్రస్తుత ప్రశ్న. రూ. 11 కోట్లు చిక్కన విషయం తెలియగానే ఆ పార్టీ కీలక నేతల్లో వణుకు మొదలైంది. ఏం చేయాలన్నా కీలక వ్యక్తులు అరెస్టు కావడంతో ముఖ్యనేతలు సైలెంట్ ఉండే పరిస్థితి ఏర్పడింది.

ఈ కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.18 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని శ్వేతపత్రంలో ప్రభుత్వ వెల్లడించిన విషయం తెల్సిందే. ఇప్పటివరకు రూ. 60 కోట్లను జప్తు చేసినట్టు ఛార్జిషీటులో సిట్ అధికారులు ప్రస్తావించారు. రానున్న రోజుల్లో మరింత డబ్బు, బంగారం పట్టుబడడం ఖాయమని అంటున్నారు.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×