E-Paper
Advertisement

High court dismissed the petitions: ఆ ఇద్దరు వైసీపీ అభ్యర్థులకు భారీ షాక్.. !

High court dismissed the petitions: ఆ ఇద్దరు వైసీపీ అభ్యర్థులకు భారీ షాక్.. !
Advertisement

High court dismissed the petitions(AP latest news): ఏపీ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసినటువంటి పిటిషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం డిస్మిస్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో పోలింగ్ రోజున హింసాత్మక సంఘటనల నేపథ్యంలో సత్తెనపల్లిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో రీ-పోలింగ్ నిర్వహించాలని కోరుతూ మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కూడా డిస్మిస్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఓకేసారి జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో పోలింగ్ రోజు, ఆ తరువాత ఏపీలో పలుచోట్లా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మాచర్ల, తిరుపతి, తాడపత్రితోపాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి ఈ హింసాత్మక సంఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్, డీజీపీ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరై ఏపీలో నెలకొన్న హింసాత్మక సంఘటనలపై వివరణ ఇచ్చారు. ఆ తరువాత ఎన్నికల సంఘం ఏపీలోని పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. అనంతరం వారి స్థానంలో ఇతర అధికారులను నియమించిన విషయం తెలిసిందే.

Advertisement

ఆ తరువాత సిట్ ఏర్పాటు చేసి విచారణ చేసి ఓ నివేదికను తయారు చేసి తమకు పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఆ సిట్ బృందం ఏపీలో హింసాత్మక సంఘటనలు ఎక్కడైతే చోటు చేసుకున్నాయో అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేసింది.

Also Read: ఏపీలో భారీ వర్షాలు.. ఎప్పట్నుంచంటే..?

Advertisement

అనంతరం హింసాత్మక సంఘటనలకు సంబంధించి ప్రాథమిక నివేదికను రాష్ట్ర డీజీపీకి సిట్ అందించిన విషయం తెలిసిందే. అందులో పలు అంశాలను పేర్కొన్నది. హింసాత్మక సంఘటనలకు సంబంధించి కారణాలు, కారకులు.. ఇలా సిట్ పరిశీలించిన అంశాలను ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అదేవిధంగా ఫలితాలు రోజు జూన్ 4న తీసుకోవాల్సిన ముందస్తు శాంతిభద్రత పరమైన చర్యలకు సంబంధించి కూడా పలు అంశాలను అందులో సూచించినట్లు తెలిసిందే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×