E-Paper
Advertisement

AP : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

AP : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Advertisement

AP : ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సేవలందించేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,489 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దూర ప్రాంతాలు, అంతర్రాష్ట సర్వీసుల కోసం ఈ బస్సులను వినియోగించనుంది.

Advertisement

డీలర్ల వద్ద నుంచి కాకుండా నేరుగా బస్సుల తయా­రీ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో బస్‌ ఖరీదు దాదాపు రూ.45 లక్షల చొప్పున మొత్తం రూ.670 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే జ్యుడీషియల్‌ ప్రివ్యూకు ఆర్టీసీ నివేదించింది. టెండర్‌ డాక్యుమెంట్లను జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టెండరు నిబంధనలు, ఇతర అంశాలపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ-మెయిల్‌ ద్వారా తెలిపే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×