E-Paper
Advertisement

AP Schemes: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇదొక్కటి మిస్ అయితే.. పథకాలన్నీ కట్..

AP Schemes: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇదొక్కటి మిస్ అయితే.. పథకాలన్నీ కట్..
Advertisement

AP Schemes: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి లోగా అర్హులకు తమ ప్రభుత్వం న్యాయం చేయనుందని, ఎన్నో ఏళ్లుగా వేచి ఉన్న అర్హులకు తాము డిసెంబర్ 28వ తేదీలోగా మేలు చేకూర్చనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రతి సామాన్య కుటుంబానికి రేషన్ కార్డు లేనిదే పని కాదు. అందుకు ప్రధాన కారణం ప్రతి నెలా ప్రభుత్వం అందించే రేషన్ పొందే సదుపాయం కూడా ఈ కార్డు ద్వారానే అందుతుంది. అంతేకాదు ఏ ప్రభుత్వ పథకం ద్వారానైనా లబ్ధి చేకూరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డు లేకుంటే ఏ సంక్షేమ పథకాలు అర్హత సాధించలేము.

Advertisement

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం-2 పథకానికి కూడా అనర్హులే. అందుకే ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఆధారమేనని చెప్పవచ్చు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం లబ్ధి చేకూరాలనా రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటారు. అంతటి ప్రాధాన్యత గల రేషన్ కార్డు లేని వారందరికీ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది.

రేషన్ కార్డును అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించగా, సంక్రాంతి లోగా అర్హులందరికీ నూతన రేషన్ కార్డు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 2వతేదీ నుండి 28వతేదీ లోగా అర్హుల నుండి రేషన్ కార్డుకై దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం అర్హులకు జనవరిలో నూతన కార్డులను అందజేస్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే, నూతన రేషన్ కార్డులను అందజేస్తామని ప్రకటించింది.

Advertisement

Also Read: Woman Kidnaps Boyfriend: ప్రియుడిపై మరీ అంత ప్రేమనా.. ఏకంగా కిడ్నాప్ చేసి మరీ.. అలా చేసిందేంటి!

అలాగే మంత్రి నారా లోకేష్ సారథ్యంలో యువగళం పాదయాత్ర నిర్వహించిన సమయంలో కూడా, గత ప్రభుత్వం అర్హుల కార్డులను తొలగించిందని తమకు న్యాయం చేయాలని భాదితులు కోరారు. ఈ నేపథ్యంలో ముందుగా అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోబోతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మరచిపోవద్దు సుమా.. డిసెంబర్ నెలలో దరఖాస్తు చేసుకోండి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×