E-Paper
Advertisement

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?
Advertisement

ముంబయి నటీమణి కాదంబరి జెత్వాని కేసు కీలక మలుపు తీసుకోనుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నాయి.

ఈ కేసులో నలుగురు పోలీసులతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు, మరో న్యాయవాది మొత్తం ఐదుగురు వ్యక్తులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం, వాదనలు పూర్తి చేసినట్లు సమాచారం.

Advertisement

ఈ మేరకు తీర్పును రిజర్వు చేస్తూ అక్టోబర్ 4న వెలువరిస్తామని కోర్టు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు గత 15 రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఏపీ ఉన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. వాస్తవానికి ఈరోజు వరకు సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.

Also read : దసరాకు సూపర్ కానుక ప్రకటించిన ప్రభుత్వం.. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు

Advertisement

సీనియర్ ఐపీఎస్ అధికారి పాత్ర ఉన్న నేపథ్యంలోనే ఈ కేసును ఏపీసీఐడీకి అప్పగించేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధింపులకు గురి చేశారని ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నిపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించి దిగువస్థాయిలో ఇన్‌స్పెక్టర్లు, ఆ కింద స్థాయి అధికారులు అప్రూవర్‌లుగా మారడంతో ముగ్గురు ఐపీఎస్‌లకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.

కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఐపీఎస్‌లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, అందుకు చాలా ప్రోసీజర్లను అనుసరించాలని యూపీఎస్సీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాతే ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులపై చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది.  ఈ వ్యవహారంపై కాదంబరి జెత్వాని ఫిర్యాదుతో కదిలిన పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ కారణంగానే సీఐడీ విచారణకు ప్రభుత్వం నేడో రేపో ఉత్తర్వులు విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×