E-Paper
Advertisement

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘స్పందన’లో మార్పులకు శ్రీకారం

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘స్పందన’లో మార్పులకు శ్రీకారం
Advertisement

AP Government Spandana programme(Andhra news today): ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్పందన’ కార్యక్రమాన్ని సమూలంగా మార్పులు చేస్తోంది. ఈ కార్యక్రమంలో అనేక లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ‘స్పందన’ కార్యక్రమాన్ని ‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్’గా పునరుద్ధరిస్తూ కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కలెక్టర్లకు ఆదేశాలు..

Advertisement

‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్’ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్లలో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సీఎంఓతోపాటు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి సమస్యలను పరిష్కరించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

సమస్యల పరిష్కారమే..

Advertisement

2014లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రస్థాయి గ్రీవెన్స్‌ల పరిశీలన కోసం ప్రజావేదిక నిర్మించింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజావేదికను కూల్చివేశారు. తాడేపల్లి వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తామంటూ హడావిడి చేసిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తయినప్పటికీ ప్రారంభించలేదు. కేవలం స్పందన రివ్యూలతోనే జగన్ ప్రభుత్వం కాలయాపన చేసినట్లు కొత్త ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా స్పందన కార్యక్రమంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందులను గుర్తించిన టీడీపీ ప్రభుత్వం.. ససమ్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమాన్ని మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×