E-Paper
Advertisement

Rayalaseema lift irrigation: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం రిప్లై

Rayalaseema lift irrigation: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం రిప్లై
Advertisement

Rayalaseema lift irrigation: తెలంగాణలో రాజకీయాలు ఏపీకి పాకాయి. ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఈ విషయంలో సీఎం వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుపట్టింది. ఇంతకీ సీఎం రేవంత్‌రెడ్డి ఏమన్నారు? కాస్త డీటేల్స్ లోకి వెళ్తే..

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీఎం రేవంత్ కామెంట్స్

Advertisement

తెలంగాణ అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై శనివారం సుధీర్ఘ చర్చ జరిగింది. కృష్ణా-గోదావరి జలాలపై మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది ఏపీ ప్రభుత్వం. తన విన్నపం మేరకు సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని చేసిన వ్యాఖ్యలు అసత్యమని చెప్పింది. మాజీ సీఎం జగన్ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌ చేపట్టింది.

Advertisement

రిప్లై ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, అసలు మేటరేంటి?

రోజుకు మూడు టీఎంసీల నీరు అని చెబుతూ భారీ ప్రకటనలు ఇచ్చింది తెలిపింది. అనుమతులు లేకుండా జగన్ హయాంలో పనులు చేపట్టారని వివరించింది. జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై న్యాయస్థానంలో కేసులు వేసింది అప్పటి తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం, ఎన్జీటీతో సహా పలుస్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులతో విచారించిన న్యాయస్థానం అనుమతులు లేని కారణంగా పనులను నిలిపివేసినట్టు క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు 2020లో ఎన్టీటీ, కేంద్రానికి ఆదేశాలు ఇచ్చిందని ప్రస్తావించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆ ప్రాజెక్టు పనులను కేంద్రం నిలిపి వేసిందనట్టు తెలిపింది.

ALSO READ:  ఏపీకి గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్

శనివారం అసెంబ్లీలో నదీ జలాలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. అందులో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి కేసీఆర్‌ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారని, తాను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఆపించానని అన్నారు. ఆ పనులు ఆగాయో లేదో తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని పంపించాలన్నారు.

చంద్రబాబు నాయకత్వంలో పని చేసిన తాను.. ఆ నాయకత్వాన్ని, ఆ పార్టీని వదిలిపెట్టానని అన్నారు. అలాంటిది తెలంగాణకు అన్యాయం చేస్తానా? మొదట తనకు తెలంగాణ అని, ఆ తర్వాతే పార్టీ అని వ్యాఖ్యానించారు. తనలాంటి వాళ్లు తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×