E-Paper
Advertisement

AP Govt: ఏపీలో మహిళలకు శుభవార్త, ఇంకెందుకు ఆలస్యం, హాయిగా వ్యాపారాలు పెట్టుకోవచ్చు,

AP Govt: ఏపీలో మహిళలకు శుభవార్త, ఇంకెందుకు ఆలస్యం, హాయిగా వ్యాపారాలు పెట్టుకోవచ్చు,
Advertisement

AP Govt: ఏపీలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది.. పెడుతూనే ఉంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలను పొదుపు సంఘాల సభ్యులుగా కాకుండా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర పథకాలతో కలిసి భారీ రాయితీలతో కూడిన రుణాలను అందిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. గ్రామాల్లో ప్రత్యేక సభలు నిర్వహించి ఆసక్తి- అర్హులైన మహిళలను ఎంపిక చేస్తున్నారు అధికారులు.

మహిళల వ్యాపారాలు.. ఆపై రాయితీ వివరాలు

Advertisement

యూనిట్ విలువ లక్ష వరకు ఉంటుంది. అందులో రాయితీ సబ్సిడీ 35 వేలు కాగా, బ్యాంకు రుణం 65 వేలు వరకు ఉంటుంది. అయితే ఈ యూనిట్లు చిన్న స్థాయి వ్యాపారాలకు సరైనవి. వాటిలో చిన్న కిరాణా షాపులు, పచ్చళ్ల తయారీ, చిన్న డెయిరీ ఫాంలు మొదలైనవి ఉండనున్నాయి.

రెండు లక్షల వరకు సబ్సిడీ వివరాలు

Advertisement

యూనిట్ ఖర్చు 2 లక్షల రూపాయలు. అందులో రాయితీ అంటే సబ్సిడీ 75 వేలు కాగా, మిగతాది బ్యాంకు రుణం ఇప్పించనుంది. ఈ నిధుల ద్వారా ఆవులు లేదా గేదెలు, గొర్రెలు, మేకలు, షెడ్ నిర్మాణం చేయవచ్చు. ఈ యూనిట్లు గ్రామీణ మహిళలకు డెయిరీ, పశు పోషణ వ్యాపారాల్లో అండగా నిలుస్తాయి.

పైన చెప్పినవి కాకుండా పెద్ద యూనిట్లకు రాయితీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యూనిట్ ఖర్చు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటే రాయితీ ఈ విధంగా ఉంటుంది. అందులో రాయితీ లక్షా 35 వేలు ఉంటుంది. బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ వాటికి 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెట్టుబడి ఇస్తుంది. వ్యవసాయ పరికరాలు వాటికి 5 లక్షల నుండి 10 లక్షల వరకు బ్యాంకు రుణం ఇప్పించనుంది.

ALSO READ: ఎంపీలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ

ప్రోత్సాహం అందిస్తున్న ఇతర వ్యాపారాల జాబితాను ఒక్కసారి చూద్దాం. కిరాణా షాపులు, పచ్చళ్ల తయారీ, డెయిరీ ఫాం, సిమెంటు బ్రిక్స్ యూనిట్ వంటివి ఉన్నాయి. అలాగే ఐస్‌క్రీమ్, కారంపొడి, తేనె తయారీ కూడా. వీటితోపాటు గార్మెంట్స్, ఎంబ్రాయిడరీ, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు ఇందులో ఉన్నాయి.

ఈ పథకం ద్వారా ఎంపికైన డ్వాక్రా మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ప్రభుత్వం సబ్సిడీతోపాటు వారికి ట్రైనింగ్ కూడా అందించనుంది. మరిన్ని వివరాల కోసం స్థానిక డ్వాక్రా సంఘాలు లేకుంటే గ్రామ- వార్డు సచివాలయాలను సంప్రదించవచ్చు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×