E-Paper
Advertisement

Anantapur : పెనుకొండ బరిలో మంత్రి ఉషశ్రీచరణ్.. ఎంపీ మాధవ్ కు స్థానచలనం తప్పదా?

Anantapur : పెనుకొండ బరిలో మంత్రి ఉషశ్రీచరణ్.. ఎంపీ మాధవ్ కు స్థానచలనం తప్పదా?
Advertisement

Anantapur : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీలో మరో మంత్రికి స్థాన చలనం కలగడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి ఉష శ్రీ స్వయంగా ఈ ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల్లో కళ్యాణ దుర్గం నుంచి కాకుండా పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం ఆదేశాలను పాటిస్తానని మేము ఎక్కడికి వెళ్లినా.. ఒక్కటే నినాదం.. అది జగన్ నినాదం అని మంత్రి వెల్లడించారు.

ఇన్ని రోజులు కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో ఆదరించారని.. వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని మంత్రి అన్నారు. సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగా.. కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ప్రజలు ఎక్కడైనా సరే జగన్ ను, ఫ్యాన్ గుర్తునే చూస్తున్నారని ఉషశ్రీ స్పష్టం చేశారు.

Advertisement

మరోవైపు టికెట్ మార్పుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. టికెట్ మారుస్తునట్టు ఎలాంటి సమాచారం లేదన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్తామని.. పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×