E-Paper
Advertisement

Amaravathi Padayatra : అమరావతి రైతుల పాదయాత్ర గ్రీన్ సిగ్నల్.. వారికే అనుమతి

Amaravathi Padayatra : అమరావతి రైతుల పాదయాత్ర గ్రీన్ సిగ్నల్.. వారికే అనుమతి
Advertisement

Amaravathi Padayatra : అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్రను నిలుపుదల చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసింది. ఐడీ కార్డులు ఉన్నవారే పాదయాత్రలో పాల్గొనాలని హైకోర్టు ఆదేశించింది. రైతులకు వెంటనే ఐడీ కార్డులు ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. అమరావతి రైతులకు ప్రజలు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలపవచ్చని న్యాయస్థానం పేర్కొంది.
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని హైకోర్టు ధర్మాసనం మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని తేల్చిచెప్పింది. షరుతులకు లోబడే పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది. డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా పోలీసులకు చూపించాలని హైకోర్టు పేర్కొంది. తమ ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ పాదయాత్రలో షరతులను ఉల్లంఘిస్తే యాత్ర రద్దు కోసం రాష్ట్ర డీజీపీ తమను ఆశ్రయించవచ్చని హైకోర్టు చెప్పింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×