E-Paper
Advertisement

Chintamaneni prabhakar: మళ్లీ తెరపైకి చింతమనేని.. ఈసారి సాక్షి ఆఫీస్ పైకి

Chintamaneni prabhakar: మళ్లీ తెరపైకి చింతమనేని.. ఈసారి సాక్షి ఆఫీస్ పైకి
Advertisement

గతంలో టీడీపీ హయాంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దూకుడు గురించి అందరికీ తెలిసిందే. ఓ మహిళా ఎమ్మార్వోతో ఆయన ప్రవర్తన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత టీడీపీకి కూడా అది కాస్త ఇబ్బందిగా మారింది. మళ్లీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక మరోసారి చింతమనేని వార్తల్లో వ్యక్తిగా మారారు. ఈసారి ఆయన సాక్షి ఆఫీస్ పై దాడి చేశారని అంటున్నారు. తనపై తప్పుడు వార్తలు రాసినందుకు నిలదీయడానికి మాత్రమే వచ్చానని ఆయన చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతున్నా.. మరోసారి చింతమనేని వార్తల్లోకెక్కడం, అది కూడా దాడి చేశారని ఆయనపై ఆరోపణలు రావడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

టీడీపీలో చింతమనేని ఫైర్ బ్రాండ్. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, మహిళా ఎమ్మార్వోపై దాడి చేశారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రవర్తన సమర్థనీయంగా లేనట్టు వీడియో సాక్ష్యాలు కూడా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ ఫలితం 2019లో కనపడింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో చింతమనేని దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి మరో వివాదంతో ఆయన మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.

Advertisement

ఆఫీస్ పై దాడి..?
ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపైకి ఆయన దాడికి వెళ్లారంటూ వీడియోలను సాక్షి మీడియా బయటపెట్టింది. కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు దెబ్బతిన్నట్టుగా కొన్ని వీడియోలను పోస్ట్ చేశారు. చింతమనేని, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీస్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఆఫీస్ లోని కంప్యూటర్లు ధ్వంసం చేశారని అంటున్నారు.

Advertisement

అసలు కారణం ఏంటి..?
దెందులూరు నియోజకవర్గానికి చెందిన దాసరి బాబూరావు అనే వ్యక్తికి చెందిన పొలంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నారని అంటున్నారు. అయితే సదరు బాబూరావు టీడీపీ ఆఫీస్ కి వెళ్లడం, అక్కడ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్యాయత్నానికి ఎమ్మెల్యే చింతమనేని కారణం అంటూ సాక్షిలో కథనం వచ్చింది. దీన్ని ఎమ్మెల్యే ఖండించారు. వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాశారని, తనకి సంబంధం లేకపోయినా తన పేరుని అందులో చేర్చారని ఆయన అంటున్నారు. ఆ విషయం కనుక్కోడానికే తాను సాక్షి ఆఫీస్ కి వచ్చానంటున్నారు చింతమనేని. అంతేకానీ తాను అక్కడ ఎలాంటి గొడవ చేయలేదని చెబుతున్నారు.

సాక్షి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. చింతమనేని సదరు రిపోర్టర్ తో ఫోన్ లో మాట్లాడుతున్న వీడియోని కూడా సాక్షి సోషల్ మీడియాలో ఉంచింది. చింతమనేని వల్లే బాబూరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారని వైసీపీ కూడా ఆరోపిస్తోంది. ఇక సాక్షి ఆఫీస్ పై దాడి అంటూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు వైరల్ చేస్తున్నారు. తనపై కావాలనే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారంటూ చింతమనేని చెప్పడం విశేషం. మరి చింతమనేని విషయంలో నిజానిజాలు ఏంటో నిలకడమీద తెలియాల్సిందే. అయితే ఆయన రోడ్డెక్కడం, సాక్షి తమపై దాడి జరిగిందని చెప్పడం మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×