E-Paper
Advertisement

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు
Advertisement

AP Government: విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఎయిర్ బస్ ఛైర్మన్ రెనీ ఒబెర్మన్ తో పాటు ఎయిర్ బస్ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు. మేకిన్ ఇండియా, స్వదేశీకరణ అవకాశాల అన్వేషణలో భాగంగా ఎయిర్ బస్ బోర్డ్ మొదటిసారి భారతదేశానికి రావడం జరిగింది.

రాష్ట్రంలో ఎయిర్ బస్ ఆధారిత ప్రపంచస్థాయి ఏరోస్పేస్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీతో పాటు దీనికి అనుబంధంగా టైర్-1, టైర్-2 సరఫరాదారుల సహ ఉత్పత్తి యూనిట్ల రూపంలో కలిసి పనిచేసేలా ప్రతిపాదనను మంత్రి లోకేష్ వారి ముందుంచారు. ఏపీలో ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమి లభ్యతతో పాటు ప్రాజెక్ట్ వేగవంతంగా పూర్తి, గ్లోబల్ క్వాలిటీ మాన్యుఫాక్చరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కు అనుకూలంగా ఉన్న రాష్ట్ర ఏరో స్పేస్ పాలసీని వివరించారు. తద్వారా రాష్ట్రాన్ని ఎగుమతి ఆధారిత ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

Advertisement

ALSO READ: Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

ప్రధాన యూనిట్ తో పాటు సరఫరాదారులు, ఎంఎస్ఎంఈలు, భాగస్వాములు కలిసి పనిచేయగల ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ ను కోరారు. దీనివల్ల టైమ్ లైన్ రిస్క్ లు తగ్గడంతో పాటు లోకలైజేషన్ పెరిగి తక్కువ ఖర్చుతో విస్తృతస్థాయిలో తయారీ సాధ్యం అవుతుందని వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఏరోస్పేస్ కారిడార్ లలో అనేక సైటింగ్ ఆప్షన్స్ ఉన్నాయని, అవి ఎయిర్ బస్ ప్రోగ్రామ్ అవసరాలకు, సరఫరాదారుల క్లస్టరింగ్, రవాణ సౌకర్యాలు, భవిష్యత్ విస్తరణలకు అనుగుణంగా ఉంటాయని వివరించారు.

Advertisement

ALSO READ : SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

ఈ భేటీ కోసమే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా న్యూఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడిదారుల ప్రాధాన్య విధానాన్ని, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో సౌకర్యం, నిర్ధిష్ట గడువులోగా ప్రాజెక్ట్ అమలు వంటి అంశాలతో పాటు చంద్రబాబు గారి బ్రాండ్, ప్రపంచస్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించిన ఆయన ట్రాక్ రికార్డ్ ను వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఏపీ దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఎయిర్ బస్ రాష్ట్రంలో యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన పూర్తి ఎకో సిస్టమ్ అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×