E-Paper
Advertisement

Aadudam Andhra: ఏపీలో “ఆడుదాం ఆంధ్రా”.. 12 కోట్లు ప్రైజ్ మనీ.. రిజిస్ట్రేషన్లు షురూ

Aadudam Andhra: ఏపీలో “ఆడుదాం ఆంధ్రా”.. 12 కోట్లు ప్రైజ్ మనీ.. రిజిస్ట్రేషన్లు షురూ
Advertisement

Aadudam Andhra: ఏపీ ప్రభాత్వం క్రీడా సంరంభానికి తెరలేపింది. “ఆడుదాం ఆంధ్రా” పేరుతో భారీ ఎత్తున క్రీడా పోటీల నిర్వహణకు జగన్ సర్కార్ సిద్ధమైంది. పలు క్రీడా అంశాల్లో ఈ పోటీలు జరగనుండగా.. నేడు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన ఆటగాళ్లు (15 ఏళ్లకంటే ఎక్కువ వయసు) తమ పేరు, వివరాలను సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలి. డిసెంబర్ 13 వరకూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని.. వాలంటీర్ల ద్వారా లేదా.. https://aadudamandhra.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా కానీ ,1902 ఫోన్ నంబర్ ద్వారా కానీ వివరాలను నమోదు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రీడలు డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకూ జరుగుతాయి.

ఈ పోటీల్లో మొత్తం రూ.12 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నారు. పోటీదారులే కాకుండా.. పోటీలను వీక్షించే వారు కూడా రిజిస్టర్ చేసుకునేలా వెబ్ సైట్ లో అవకాశం కల్పించారు. కాగా.. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు ప్రముఖ క్రీడాకారులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు, క్రికెటర్లు అంబటి రాయుడు, ఎమ్మెస్కే ప్రసార్, శ్రీకర్ భరత్, భరత్ అరుణ్, హనుమ విహారి, చెస్ ప్లేయర్స్ ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, లలిత్ బాబు, బి. ప్రత్యూష, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, చేతన్ ఆనంద్, కిదాంబి శ్రీకాంత్ తదితరులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×