E-Paper
Advertisement

Uttarakhand : నదిలోకి దూసుకెళ్లిన వాహనం.. తెలుగు వ్యక్తి మృతి..

Uttarakhand : నదిలోకి దూసుకెళ్లిన వాహనం.. తెలుగు వ్యక్తి మృతి..
Advertisement

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తెహ్రి జిల్లా గులార్‌ వద్ద నదిలో పర్యాటకుల వెహికిల్ బోల్తా పడింది. విరిగిపడిన కొండచరియలను తప్పించుకునే క్రమంలో ఆ వాహనం నదిలోకి దూసుకెళ్లింది.

ప్రమాదానికి గురైన వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఐదుగురిని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. గల్లంతైన మరో ఆరుగురి పర్యాటకుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

ఈ వాహనంలో విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు కూడా ఉన్నారు. రాజాం మండలం బొద్దాంకు చెందిన రవి రంగారావు దంపతులు హైదరాబాద్‌ నుంచి పర్యటనకు వెళ్లారని సమాచారం. వాహనం నదిలో దూసుకెళ్లిన తర్వాత రవి రంగారావు భార్యను విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. అయితే రవి రంగారావు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చివరకు ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×