E-Paper
Advertisement

Nuziveedu IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది ? 3 రోజుల్లో 800 మంది ?

Nuziveedu IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది ? 3 రోజుల్లో 800 మంది ?
Advertisement

Nuziveedu IIIT: ఇటీవల కాలంలో స్కూళ్లు, విద్యాసంస్థలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం పెట్టే ఆహారమైనా, ఫీజులు తీసుకుని వండిపెట్టే ఫుడ్ అయినా సరే.. క్వాలిటీ ఉండటం లేదు. నిల్వ ఉంచిన, నాసిరకం ఆహారం విద్యార్థులకు పెడుతుండటంతో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.

తాజాగా ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఒకేసారి 800 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గడిచిన మూడ్రోజుల్లో సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కమిటీ వేశామని, విచారణ జరుగుతోందని కళాశాల అధికారి తెలిపారు.

Advertisement

Also Read: పిల్లల భవిష్యత్తు కోసం సౌదీ వెళ్లి.. తిరిగి వస్తూ అనాధలా చనిపోయింది.

మరోవైపు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో ఉన్న బాలికల గురుకుల విద్యాలయంలోనూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 62 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గురుకులంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే ఉందని, ఆహారం కూడా నాణ్యంగా లేదంటున్నారు తల్లిదండ్రులు.

Advertisement

నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి నారా లోకేశ్ ఆరా తీశారు. భారీ సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను హెచ్చరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×