E-Paper
Advertisement

Vijayawada: అనుమానంతో నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి..

Vijayawada: అనుమానంతో నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి..
Advertisement

 Vijayawada:  విజయవాడ సూర్యారావు పేటలో ఓ కిరాతక భర్త బరితెగించాడు. నడిరోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. విజయవాడ విన్స్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతిని 2022 ఫిబ్రవరి 14వ తేదీన విజయ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో విజయ్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే సరస్వతిపై అనుమానం పెంచుకున్న హంతకుడు విజయ్..తరచూ భార్యతో గొడవపడేవాడు. భర్త అనుమానంతో విసిగిపోయిన సరస్వతి కొన్నాళ్లుగా భర్తకు దూరంగా బాబుతో ఉంటోంది. ఈ క్రమంలో సరస్వతిపై కోపం పెంచుకున్న కిరాతకుడు విజయ్…ఇవాళ మధ్యాహ్నం సూర్యారావుపేటలో అందరూ చూస్తుండగా…కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×