E-Paper
Advertisement

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!
Advertisement

Kakinada Explosion: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ గట్టున ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడటంతో సుమారు 20 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అదే విధంగా మృతల సంఖ్య ఇప్పుడు 23 కు చేరుకుంది. మృతుల్లో అత్యధికంగా మహిళలే ఉండటం కలచివేసే అంశం.

ప్రమాద సమయంలో తయారీ కేంద్రంలో సుమారు 50 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి, ఘటనాస్థలి అత్యంత భయానకంగా మారింది. ఈ పేలుడు శబ్దం ఎంత తీవ్రంగా ఉందంటే, దాదాపు సామర్లకోట వరకు వినిపించిందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా సామర్లకోట, వేట్లపాలెం, హుస్సేన్‌పురం గ్రామాలకు చెందినవారు. వీరంతా గత పదేళ్లుగా ఇదే కేంద్రంలో నమ్మకంగా పని చేస్తున్నారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఇంకా కొంతమంది కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎఐ వీడియో ఇప్పుడు చూద్దాం..

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×