E-Paper
Advertisement

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు
Advertisement

Amit Shah high-level meeting: జమ్ముూకశ్మీర్‌లో వరుసగా జరగుతున్న ఉగ్రవాద అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతాథికారులను ఆదేశించారు. ఈ నెల 29 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో అమిత్ షా ఢిల్లీలోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశంఉన్నందున ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. ఉగ్రవావద చర్యలను నియంత్రించేందుకు భద్రత దళాలకు వెంటనే తగిన సూచనలు ఇవ్వాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లను నివారించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వద్ద భద్రతా దళాలను మోహరించాలని ఆదేశించారు.

Advertisement

జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాద నిరోధానికి చేపడుతున్న చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలపై ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆదేశాలను అమిత్ షా సమీక్షలో ప్రస్తావించారు. దేశ సమగ్రత, భద్రత విషయంలో రాజీపడే సమస్యే లేదన్నారు. సైనికాధికారులు నిరంతరం పటిష్ట నిఘాతో ఉగ్రదాడులకు అడ్డుకట్ట వేసేలా చూడాలన్నారు. మరోవైపు అమర్ నాథ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల వరకు భీమా సదుపాయం కల్పించాలని అధికార వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×