E-Paper
Advertisement

రాజధాని, శతాబ్ది ట్రైన్ ఆలస్యమైందా? ఈ రూల్ పాటిస్తే ఫ్రీ భోజనం, రీఫండ్ సౌకర్యం

రాజధాని, శతాబ్ది ట్రైన్ ఆలస్యమైందా? ఈ రూల్ పాటిస్తే ఫ్రీ భోజనం, రీఫండ్ సౌకర్యం
Advertisement

రైలు ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడడం సహజం. గంటల తరబడి స్టేషన్‌లో వేచి ఉండాల్సి వస్తుంది. అయితే భారతీయ రైల్వే ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికుల కోసం కొన్ని ప్రత్యేక సౌకర్యాలను అందిస్తుంది. చాలా మందికి ఈ ప్రయోజనాల గురించి తెలియదు. ముఖ్యంగా ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వారికి ఉచిత భోజనం, రీఫండ్ వంటి సదుపాయాలు లభిస్తాయి. ఈ నిబంధనలను తెలుసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

ఏ రైళ్లలో ఉచిత భోజనం అందుతుంది?

రాజధాని, శతాబ్ది, దురంటో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ఈ సౌకర్యం ఉంటుంది. రైలు కనీసం రెండు గంటలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచితంగా భోజనం అందిస్తారు. ప్రయాణ సమయాన్ని బట్టి టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, టీ లేదా స్నాక్స్ ఇస్తారు. ఈ సేవల ద్వారా రైల్వే విభాగం ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు.

ఉచిత భోజనంలో ఏం లభిస్తాయి?

Advertisement

ప్రయాణ ప్రారంభంలో సాధారణంగా టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్లు అందిస్తారు. భోజన కిట్‌లో చక్కెర లేదా షుగర్ ఫ్రీ సాచెట్లు, మిల్క్ క్రీమర్ కూడా ఉంటాయి. అల్పాహారంలో నాలుగు బ్రెడ్ స్లైసులు, వెన్న, 200 మిల్లీలీటర్ల ఫ్రూట్ డ్రింక్, టీ లేదా కాఫీ ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నంతో పాటు చోలే, రాజ్మా లేదా పప్పు వంటకాలు ఉంటాయి. భోజనంతో పాటు ఊరగాయ ప్యాకెట్ కూడా అందిస్తారు. మరో ఎంపికగా ఏడు పూరీలు, మిక్స్ వెజిటబుల్ కూర, ఊరగాయ, ఉప్పు, మిరియాల సాచెట్లు ఇస్తారు. అయితే మెనూ రైలు, మార్గాన్ని బట్టి మారవచ్చు.

రైలు ఆలస్యమైతే రీఫండ్ ఎలా పొందాలి?

రైలు మూడు గంటలకు మించి ఆలస్యమైతే లేదా మార్గం పూర్తిగా మారితే ప్రయాణికులు పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసిన వారు అదే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ టికెట్ రద్దు చేయాలి. రైల్వే కౌంటర్‌లో టికెట్ తీసుకున్న వారు కౌంటర్‌కు వెళ్లి టికెట్ రద్దు చేసుకోవాలి. అర్హులైన ప్రయాణికులకు పూర్తి టికెట్ మొత్తం తిరిగి చెల్లిస్తారు.

Advertisement

Also Read: ఖర్చు లేకుండానే డేటింగ్ చేయాలా? తక్కువ బడ్జెట్‌లో ఇలా ప్లాన్ చేయండి

ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి

దీర్ఘకాల ఆలస్యాల సమయంలో భారతీయ రైల్వే అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. ప్రయాణికులు ఉచితంగా వెయిటింగ్ రూమ్‌లను ఉపయోగించుకోవచ్చు. స్టేషన్‌లలోని ఆహార కేంద్రాలు ఎక్కువసేపు తెరిచి ఉంచుతారు. ముఖ్యంగా రాత్రి ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే పోలీస్ అదనపు సిబ్బందిని కూడా నియమిస్తుంది.

ప్రయాణికుల హక్కులను తెలుసుకోండి

రైల్వే నిబంధనలను తెలుసుకోవడం వల్ల అనవసరమైన ఇబ్బందులు తగ్గుతాయి. ప్రయాణానికి ముందు రైలు సమయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి. టికెట్‌ను భద్రంగా ఉంచుకోవాలి. రైలు ఎక్కువసేపు ఆలస్యమైతే రైల్వే సిబ్బందిని సంప్రదించి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలి.

Also Read: మాల్దీవులు, పారిస్ కంటే ట్రెండింగ్ హనీమూన్ స్పాట్స్.. ఇక్కడి వాతావరణమే రొమాంటిక్

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×