E-Paper
Advertisement

Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Advertisement

Nampally Railway Station: 2027 నాటికి హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.327 కోట్లు కేటాయించిందన్నారు. దీనిని 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

అత్యాధునిక సౌకర్యాలు

2027 చివరి నాటికి పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. నిన్న నాంపల్లి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఇకపై పనులపై క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామన్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నాంపల్లి రైల్వే స్టేషన్‌ ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Also Read: సిమ్లా, కులు, మనాలికి సమ్మర్ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్.. టికెట్ పై 33 శాతం ఆఫర్

రూ.48 వేల కోట్ల పనులు

నాంపల్లి రైల్వే స్టేషన్ రీమోడలింగ్ లో భాగంగా, రెస్టారెంట్లు, స్టాళ్లు, మెరుగైన సౌకర్యాలతో సెంట్రల్ హాల్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకని వై-ఫై కనెక్టివిటీ, సీసీటీవీ కెమెరాలు, ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 2026-27 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,450 కోట్లకు పైగా కేటాయించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా దాదాపు రూ.48,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని చెప్పారు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×