E-Paper
Advertisement

Drunken Loco Pilot: మందు కొట్టి రైలు నడిపిన లోకో పైలెట్, స్టేషన్ లో ఆపకుండానే..

Drunken Loco Pilot: మందు కొట్టి రైలు నడిపిన లోకో పైలెట్, స్టేషన్ లో ఆపకుండానే..
Advertisement

తరచుగా మద్యం తాగి వాహనాలను నడిపే వారిని చూస్తుంటాం. బైక్, ఆటో, కారు, కొన్నిసార్లు బస్సు, లారీ డ్రైవర్లు కూడ తాగి నడిపి పోలీసులకు పట్టుబడిన సందర్భాలున్నాయి. కానీ, తాజాగా ఓ మహానుభావుడు పీకలదాక మందుతాగి ఏకంగా రైలు నడిపాడు. మధ్యలో ఓ రైల్వే స్టేషన్ లో రైలు ఆపకుండానే వెళ్లిపోవడంతో అసలు కథ బయటకు వచ్చింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

జర్మనీలో అత్యంత జనాభా కలిగిన రాష్ట్రం నార్త్ రైన్ వెస్ట్‌ ఫాలియా. నిత్యం ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రైలు ప్రయాణం చేస్తుంటారు. కానీ, తాజాగా ఓ ఊహించని ఘటన జరిగింది. ఆదివారం నాడు రద్దీగా ఉన్న ప్యాసింజర్ రైలును నడిపిన లోకో పైలెట్ బాగా మద్యం తాగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆపకుండా వెళ్లిపోవడంతో..

Advertisement

RE6 అనే రీజినల్ రైలు నార్త్ రైన్ వెస్ట్‌ ఫాలియాలోని రీడా వైడెన్‌ బ్రూక్ పట్టణంలోని స్టేషన్‌ లో ఆగాల్సి ఉంది. కానీ, లోకో పైలెట్ ఆ స్టేషన్ లో ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొంత దూరంలో ఓపెన్ ట్రాక్ మీద రైలు ఆపాడు. ముందుగా ఏదైనా టెక్నికల్ సమస్యతో అలా చేసి ఉండొచ్చని అనుమానించారు. కానీ, ఆ తర్వాత ఎలాంటి సమస్యల లేకపోయినా అతడు రైలును ముందుకు తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రైల్వే మానిటరింగ్ అధికారులు ఆయన మద్యం సేవించి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

Read Also: ఆ రైళ్లకు వందేభారత్ ను తలదన్నే వేగం.. గంటకు ఎంత స్పీడ్ తో దూసుకెళ్తాయంటే?

రక్త పరీక్షల్లో మద్యం సేవించినట్లు వెల్లడి

Advertisement

స్పాట్ కు చేరుకున్న పోలీసులు లోకో పైలెట్ కు రక్త పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అతడు మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. ఎక్కువ మొత్తంలో ఆయన మద్యం తీసుకున్నట్లు గుర్తించారు. ఆయన రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ (BAC) 0.267% ఉన్నట్లు వెల్లడైంది.  నిజానికి జర్మనీలో ఎవరైనా వ్యక్తి రక్తంలో 0.05% ఆల్కహాల్ కంటెంట్ ఉండి వాహనాలు నడిపితే, మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా పరిగణించబడుతుంది. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, ప్రజా రవాణాలో పనిచేసే వారి విషయంలో ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మద్యం తీసుకోవడానికి అనుమతి లేదు. RE6 లో ఉన్న దాదాపు 250 మంది ప్రయాణికులను సేఫ్ గా రైలు నుంచి దింపినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు. రైలు నడిపిన లోకో పైలెట్ ను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా లోకో పైలెట్ చేసిన ఈ పనికి ప్రయాణీకులంతా షాకయ్యారు.

Read Also:  19 గంటల ప్రయాణం 2 గంటల్లో పూర్తి.. వచ్చేస్తోంది బుల్లెట్ రైలు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×