E-Paper
Advertisement

Sharad Pawar Slams EC: ‘పార్టీ గుర్తు కాదు.. సిద్ధాంతాలు ముఖ్యం’.. ఎన్నికల కమిషన్‌పై మండిపడిన షరద్ పవార్

Sharad Pawar Slams EC | మహారాష్ట్ర రాజకీయాలలో కురు వృద్ధుడు షరద్ పవార్ తమ పార్టీ పేరు, గుర్తుని ఎన్నికల కమిషన్ లాగేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించి.. దాని నిర్మాణం చేసిన వ్యక్తిని.. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ దూరం చేసిందని.. ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు.

Sharad Pawar Slams EC: ‘పార్టీ గుర్తు కాదు.. సిద్ధాంతాలు ముఖ్యం’.. ఎన్నికల కమిషన్‌పై మండిపడిన షరద్ పవార్
Advertisement

Sharad Pawar Slams EC: మహారాష్ట్ర రాజకీయాలలో కురు వృద్ధుడు షరద్ పవార్ తమ పార్టీ పేరు, గుర్తుని ఎన్నికల కమిషన్ లాగేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించి.. దాని నిర్మాణం చేసిన వ్యక్తిని.. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ దూరం చేసిందని.. ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు.

షరద్ పవార్ 1999లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)ని స్థాపించారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఆయన పార్టీ పేరు, ఎన్నికల గుర్తుని ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్‌ వర్గానికి కేటాయించింది. దీనిపై షరద్ పవార్ ఆశర్చర్యం వ్యక్తం చేస్తూ.. సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తామని తెలిపారు.

Advertisement

ఎన్నికల కమిషన్ చేసిందని ముమ్మాటికి తప్పు అని పవర్ చెబుతూ.. పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమని.. ఎన్నికల గుర్తు కొంత వరకు మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు.

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చి.. ఏక్ నాథ్ షిండే వర్గమైన శివసేన పార్టీ.. బిజేపీ సహాయంతో అధికారంలోకి వచ్చింది. అయితే షిండే ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని భావించిన అజిత్ పవార్‌కు షరద్ పవార్ వ్యతిరేకించారు. ఆ తరువాత అజిత్ పవార్ వెంట పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆయన NCPకి తానే అధ్యక్షుడిగా ప్రకటించకున్నారు. దీంతో బాబాయ్, అబ్బాయ్ ల మధ్య పార్టీ ఆధిపత్య పోరు మొదలైంది.

Advertisement

మెజారిటీ సభ్యులు అజిత్ పవార్‌కు మద్దతు తెలపడంతో ఎన్నికల కమిషన్ ఆయన పక్షంలో నిర్ణయం తీసుకుంది.

Sharad Pawar, NCP, Ajit Pawar, Election Commission, party symbol, Supreme Court,

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×