E-Paper
Advertisement

kavitha : మునుగోడుపై కవిత మౌనరాగం?.. ఏంటి సంగతి?

kavitha : మునుగోడుపై కవిత మౌనరాగం?.. ఏంటి సంగతి?
Advertisement

kavitha : ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కూతురు. కేటీఆర్ సోదరి. నాన్న, అన్నలకు తగ్గట్టే బాగా మాటకారి. గళగళా మాట్లాడతారు. ఎలాంటి అంశంపైనైనా స్పందిస్తారు. బీజేపీ చేతిలో ఓడిపోయాననే కోపమో ఏమో.. ఆ పార్టీని విమర్శించడంలో ముందుంటారు. అలాంటి కవిత.. కీలక మునుగోడు ఎన్నికపై మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. కేసీఆర్ తో సహా యావత్ గులాబీ దళం మునుగోడులో ప్రచారంతో ఊదరగొడితే.. కవిత మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. మునుగోడులో కాలు మోపలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు? ఎందుకు? కవిత మౌనం వెనుక రీజన్ ఏంటి?

ఢిల్లీ లిక్కర్ స్కాం భయమే కవిత నోటికి తాళం పడటానికి కారణం అంటున్నారు. ఢిల్లీ మద్యం కాంట్రాక్టు అక్రమాల్లో కవిత ప్రమేయం ఉందంటూ కొంతకాలంగా కమలనాథులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. త్వరలోనే కవిత జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఇప్పటికే తెలంగాణలో సీబీఐ దాడులు చేసింది. ఒకరిని అరెస్టు కూడా చేసింది. ఆ కేసుపై ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మునుగోడు ఉప ఎన్నిక రావడంతో టీఆర్ఎస్ శ్రేణులంతా అక్కడ వాలిపోయారు ఒక్క కవిత మినహా.

Advertisement

కవిత కనుక మునుగోడుకు వస్తే.. ఆమెపై ఢిల్లీ లిక్కర్ దందాపై మరింతగా కమలనాథులు రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ విషయం గ్రహించే కవిత ఏమాత్రం తొందరపడకుండా.. మునుగోడుకు వెళ్లకుండా.. వ్యూహాత్మక మౌనం వహించారని అంటున్నారు. కవితను మనుగోడుకు వెళ్లొద్దని స్వయంగా సీఎం కేసీఆరే ఆదేశించారని చెబుతున్నారు. కవిత వెళ్లితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని.. అది బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని ఆమెను పార్టీనే పక్కన పెట్టేసిందని అంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఇప్పటి వరకూ పెద్దగా స్పందించని కవిత.. మునుగోడు ఎన్నిక ముగిసినందున ఇప్పుడైనా నోరు విప్పుతారా? బీజేపీ ఆరోపణలపై ఎదురుదాడి చేస్తారా? అనేది ఆసక్తికరం.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×