E-Paper
Advertisement

CM Revanth: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడంటే..? సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడంటే..? సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Advertisement

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవలే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. రాజకీయ వర్గాల దృష్టి ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై పడింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, పంచాయతీ ఎన్నికల ఫలితాలతో మంచి ఉత్సాహం మీద ఉంది. ఇదే ఊపును కొనసాగిస్తూ మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. అన్నీ అనుకూలిస్తే వచ్చే జనవరిలోనే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ఆలోచనను పంచుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటించడంతో పాటు.. అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు.

Advertisement

ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కోటా అమలు, దానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై అసెంబ్లీ వేదికగా ప్రజాస్వామిక పద్ధతిలో చర్చ జరగాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలకు కూడా ఈ విషయంలో తమ గళాన్ని వినిపించే అవకాశం కల్పిస్తామని, అందరి సలహాలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి వస్తామని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు.. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కిన కాంగ్రెస్ శ్రేణులు.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అటు ప్రతిపక్షాలు కూడా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా తీసుకుని వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాల్లో జరిగే చర్చ ఆధారంగానే జనవరిలో ఎన్నికలు ఉంటాయా లేదా అనే అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ALSO READ: Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట.. రూ. 15,000 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదే అని స్పష్టం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×