E-Paper
Advertisement

మేమేమన్నా ఓట్లేసే మిషన్లమా?.. కిషన్ రెడ్డిపై వీహెచ్ యుద్ధప్రకటన!

మేమేమన్నా ఓట్లేసే మిషన్లమా?.. కిషన్ రెడ్డిపై వీహెచ్ యుద్ధప్రకటన!
Advertisement

V Hanumantha Rao: ప్రభుత్వ సలహాదారు వి. హన్మంతరావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని మోదీ లక్ష్యంగా చేసిన సంచలన వ్యాఖ్యల చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కాలేరంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హన్మంతరావు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేవలం స్టేట్మెంట్లకే పరిమితమవుతున్న కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిని మోదీ దగ్గరికి తీసుకెళ్లకుండా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డికి బీసీల ఓట్లు పడవని, ఆయన ఓటమి ఖాయమని స్పష్టం చేశారు.

కులగణన – రాహుల్ గాంధీ విజయం

Advertisement

జనగణనలో భాగంగా కులగణన జరగాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా చెప్పారని ఆయన గుర్తుచేశారు. బీహార్‌లో 60 శాతం, తెలంగాణలో 55 శాతం ఉన్న బీసీలకు దేశవ్యాప్తంగా అన్యాయం జరుగుతోందని రాహుల్ గాంధీ గుర్తించారన్నారు. దేశంలో కులగణన జరిగితే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ గెజిట్‌లో కొన్ని బీసీ కులాల పేర్లే లేకపోవడం శోచనీయమన్నారు.

బీజేపీకి బీసీల హెచ్చరిక

Advertisement

తాము కేవలం ఓట్లేసే మిషన్లమా అని హన్మంతరావు ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ బిల్లులు పాస్ అవ్వాలన్నా బీసీల ఓట్లు కావాల్సిందేనన్నారు. ప్రధాని మోదీ మూడుసార్లు అధికారంలోకి వచ్చినా బీసీలకు చేసిందేమీ లేదని, ఆయనకు బీసీలపై ప్రేమ లేదని విమర్శించారు. మోదీ హిందూ కార్డుతో ఓట్లు అడుగుతున్నారని, హిందువుల్లోనూ బీసీలు ఉన్నారనే విషయాన్ని మరువరాదన్నారు. దేశవ్యాప్తంగా 60 శాతానికి పైగా ఉన్న బీసీలంతా తిరగబడితే బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, తాను స్వయంగా దేశమంతా తిరిగి బీజేపీ బీసీ వ్యతిరేకి అని ప్రచారం చేస్తానని హెచ్చరించారు.

Also Read: చంద్రబాబు హామీలన్నీ మోసమే.. జగనన్న పథకాలను కాపీ కొట్టారు.. కన్నబాబు సంచలనం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×